మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కో-చైర్మన్గా నియమించారు.
ఈ నేపథ్యంలో మెగా స్టార్ సహా ఉపాసన ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను కో చైర్మన్గా నియమించినందుకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేస్తానని ఉపాసన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనపై ఉన్న నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని.. దీనికి న్యాయం చేస్తానని ఆమె పేర్కొన్నారు.
కాగా మెగా కుటుంబానికి సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వ పదవి దక్కడం ఇదే తొలిసారి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్–2025 పేరుతో ఇటీవల ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
వచ్చే ఒలింపిక్స్ కోసం రాష్ట్రం నుంచి యువ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్రీడలను ప్రోత్సహించే బాధ్యత కూడా ఈ కమిటీపై ఉంటుంది.
ఈ కమిటీకి చైర్మన్గా సంజయ్ గోయంకాను ప్రభుత్వం నియమించింది. ఇవి స్వచ్ఛంద పదవులే అయినప్పటికీ క్రీడా రంగంలో సెలబ్రిటీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉపాసనను ఎంపిక చేయడం గమనార్హం.
This post was last modified on August 4, 2025 10:56 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…