Political News

వెంకన్న దర్శనంపై నాయుడు వర్సెస్ ఎల్వీఎస్!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అంటే ఆ ఇద్దరికీ ఎంత భక్తో మాటల్లో వర్ణించలేం. అలాంటి వారిద్దరి మధ్య ఇప్పుడు స్వామి వారి దర్శనం గురించే వివాదం నెలకొంది. స్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత వేగిరంగా కల్పించేందుకు శ్రమిస్తున్నామని ఒకరంటే… అది అసాధ్యమని, ఆ తరహా ప్రయత్నాలు మానుకోవాలని, అవన్నీ కూడా వృథా ప్రయత్నాలేనని మరొకాయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక శీఘ్ర దర్శనంపై కసరత్తు చేస్తున్న తొలి భక్తుడు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.

వీరిలో తొలి భక్తుడు టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు కాగా… టీటీడీకి దఫదఫాలుగా ఈవోగా పనిచేసిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం. టీటీడీ చరిత్రలో కొందరు చైర్మన్లు, ఈవోలు ఉన్న సమయంలో భక్తులకు ఎన్నెన్నో మంచి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. స్వామి వారికి కైంకర్యాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాంటి సందర్భాల్లో ఎల్వీ టీటీడీ ఈఓగా పనిచేసిన కాలం కూడా ఒకటి. ఇప్పుడు కూడా బీఆర్ నాయుడు తనదైన ముద్ర వేస్తూ సాగుతున్నారు.

సరే.. ఇదంతా బాగానే ఉన్నా… ఇక అసలు వివాదంలోకి వెళితే… ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల వస్తున్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించే దిశగా నాయుడు శ్రమిస్తున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నిత్యం పఠిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని స్వామి దర్శనాన్ని శీఘ్రం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలతో చర్చలు జరపగా… ఆ సంస్థలు తమ సొంత ఖర్చుతో ఆ పని చేసిపెడతామని ముందుకు వచ్చాయి. త్వరలోనే దీనిపై కసరత్తు మొదలుకానుంది.

ఇదే సమయంలో తిరుమల వచ్చిన ఎల్వీ… గంటలో స్వామి వారి దర్శనం కల్పిస్తామని భావించడం అసంభవమని ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఈ దిశగా చేసిన చాలా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, గతానుభవాలను దృఫ్టిలో పెట్టుకుని ఈ ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు. అసలు ఈ తరహా ప్రయత్నాలను ఆయన వృథా యత్నాలుగా కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే స్వామి వారి దర్శనం కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఏఐ వినియోగానికి వినియోగించే నిధులను భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలని సూచించారు.

ఎల్వీ వ్యాఖ్యలు చెవిన పడిన వెంటనే బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. ఎల్వీ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ఆయన కుండబద్దలు కొట్టారు. భక్తులకు కేవలం 2 గంటల్లో స్వామి వారి దర్శనాన్ని కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. గూగుల్, టీసీఎస్ సంస్థలు తమ సొంత ఖర్చుతో ఈ ఏర్పాట్లను చేస్తున్నాయని, ఇందులో టీటీడీ సొమ్ము నయా పైసా లేదని ఆయన తెలిపారు. అయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులను స్వామి వారి దర్శనం కోసం షెడ్లు, కంపార్ట్ మెంట్లలో గంటలు, రోజుల తరబడి వేచి చూసేలా చేయడం ఎంతవరకు సబబని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఈ వివాదం ఇంతటితోనే ఆగుతుందా? మరింత రాజుకుంటుందా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on August 3, 2025 9:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

1 hour ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago