అవును మీరు చదివింది నిజమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లాయర్లు మాత్రం చాలా హ్యీపీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏదో రూపంలో కేసులు వేయటం దానికి కౌంటర్లుగా ప్రభుత్వం తరపున వాదించటానికి లాయర్లు రెడీ అవటం రెగ్యులర్ అయిపోయింది. మామూలుగా ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్, అడిషినల్ అడ్వేకట్ జనరల్ ఎలాగూ ఉంటారు. వీళ్ళు కాకుండా మళ్ళీ లాయర్లతో ఓ ప్యానల్ కూడా ఎటు ఉంటుంది.
రాష్ట్ర హైకోర్టులో వాదించటానికి ప్రభుత్వం తరపున లీగల్ టీం ఉన్నట్లే సుప్రింకోర్టులో వాదించేందుకు కూడా మరో లీగల్ టీం ఉంటుంది. అయితే కారణాలు తెలీటం లేదుకానీ హైకోర్టులో అయినా సుప్రింకోర్టులో అయినా ప్రభుత్వం తరపున వాదించేందుకు ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపుతున్నారు. గడచిన ఏడాదినర్నలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపై కొన్ని వందల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటికీ ప్రభుత్వం తరపున లాయర్లు కాకుండా ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లు కూడా వాదించారు.
ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం, మూడు రాజధానుల వివాదం, ఇళ్ళ పట్టాల పంపిణీ లాంటి అనేక కేసులు సుప్రింకోర్టులో కూడా వాదనలు జరిగాయి. వీటిన్నింటికి ప్రభుత్వం తరపున లాయర్లకు భారీ ఎత్తున డబ్బులు చెల్లించాల్సొచ్చింది. ప్రభుత్వం ఏ లాయర్ కు చెల్లించే డబ్బయినా ప్రజాధనమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో పంచాయితీ భవనాలకు రంగులు లాంటి కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వం అనవసరమైన పంతానికి వెళ్ళటం వల్లే కేసు సుప్రింకోర్టు దాకా వెళ్ళింది.
ఈ కేసులన్నీ ఒక ఎత్తయితే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డతో ప్రభుత్వానికి జరుగుతున్న వివాదం మరోఎత్తు. ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య ప్రతి చిన్న విషయానికి వివాదం మొదలవ్వటం చివరకు అది హైకోర్టులోనో లేకపోతే సుప్రింకోర్టులోనో వాదనల దాకా వెళుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లాయర్లకు ప్రభుత్వం చెల్లించిన ఫీజైనా నిమ్మగడ్డ చెల్లించిన ఫీజయినా ప్రజాధనమే అన్న విషయం. ఎవరు కూడా తమ జేబులో నుండి డబ్బులు లాయర్లకు ఫీజులుగా చెల్లించటం లేదు. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వివాదాలు రేగుతుంటే లాయర్లకు అంత హ్యాపీగా తయారైందన్న మాట.
This post was last modified on November 19, 2020 1:01 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…