అవును మీరు చదివింది నిజమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లాయర్లు మాత్రం చాలా హ్యీపీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏదో రూపంలో కేసులు వేయటం దానికి కౌంటర్లుగా ప్రభుత్వం తరపున వాదించటానికి లాయర్లు రెడీ అవటం రెగ్యులర్ అయిపోయింది. మామూలుగా ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్, అడిషినల్ అడ్వేకట్ జనరల్ ఎలాగూ ఉంటారు. వీళ్ళు కాకుండా మళ్ళీ లాయర్లతో ఓ ప్యానల్ కూడా ఎటు ఉంటుంది.
రాష్ట్ర హైకోర్టులో వాదించటానికి ప్రభుత్వం తరపున లీగల్ టీం ఉన్నట్లే సుప్రింకోర్టులో వాదించేందుకు కూడా మరో లీగల్ టీం ఉంటుంది. అయితే కారణాలు తెలీటం లేదుకానీ హైకోర్టులో అయినా సుప్రింకోర్టులో అయినా ప్రభుత్వం తరపున వాదించేందుకు ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపుతున్నారు. గడచిన ఏడాదినర్నలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపై కొన్ని వందల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటికీ ప్రభుత్వం తరపున లాయర్లు కాకుండా ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లు కూడా వాదించారు.
ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం, మూడు రాజధానుల వివాదం, ఇళ్ళ పట్టాల పంపిణీ లాంటి అనేక కేసులు సుప్రింకోర్టులో కూడా వాదనలు జరిగాయి. వీటిన్నింటికి ప్రభుత్వం తరపున లాయర్లకు భారీ ఎత్తున డబ్బులు చెల్లించాల్సొచ్చింది. ప్రభుత్వం ఏ లాయర్ కు చెల్లించే డబ్బయినా ప్రజాధనమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో పంచాయితీ భవనాలకు రంగులు లాంటి కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వం అనవసరమైన పంతానికి వెళ్ళటం వల్లే కేసు సుప్రింకోర్టు దాకా వెళ్ళింది.
ఈ కేసులన్నీ ఒక ఎత్తయితే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డతో ప్రభుత్వానికి జరుగుతున్న వివాదం మరోఎత్తు. ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య ప్రతి చిన్న విషయానికి వివాదం మొదలవ్వటం చివరకు అది హైకోర్టులోనో లేకపోతే సుప్రింకోర్టులోనో వాదనల దాకా వెళుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లాయర్లకు ప్రభుత్వం చెల్లించిన ఫీజైనా నిమ్మగడ్డ చెల్లించిన ఫీజయినా ప్రజాధనమే అన్న విషయం. ఎవరు కూడా తమ జేబులో నుండి డబ్బులు లాయర్లకు ఫీజులుగా చెల్లించటం లేదు. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వివాదాలు రేగుతుంటే లాయర్లకు అంత హ్యాపీగా తయారైందన్న మాట.
This post was last modified on November 19, 2020 1:01 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…