ఎగువన ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా.. కృష్ణానదికి నీటి జోరు పెరిగింది. అంతేకాదు.. ఇరు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం.. దాదాపు 18 సంవత్సరాల తర్వాత.. ఆ స్థాయిలో ఇప్పుడు కృష్ణమ్మకు నీటి ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. అయితే.. దీనిపై ఏపీలోనూ కూటమి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.
సహజంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కరువు వస్తుందని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తారు. బాబుతో పాటు కరువు కూడా కలిసి వస్తుందన్న వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. దీనిని ఇప్పుడు బ్రేక్ చేస్తూ.. కృష్ణా పరివాహక ప్రాంతంలో కీలకమైన ఖరీఫ్ సీజన్లో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఈ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు కూడా కళకళలాడడంతోపాటు.. పూర్తిగా నీటి మట్టాలు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం 2,39,601 క్యూసెక్కుల నీరు చేరగా.. 2,29,743 క్యూసెక్కుల నీటిని నాగార్జు సాగర్ కు విడుదల చేశారు. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ నుంచి 1,18,790 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేశారు. పులిచింతల ఇప్పుడు 30,222 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 18,000 క్యూసెక్కుల అవుట్ ఫ్లోకు చేరుకుంది. ప్రస్తుతం పులిచింతలలో 28.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరో 17 టీఎంసీలు నీరు చేరగానే పులిచింతల నిండిపోతుంది. ఇక ప్రకాశం బ్యారేజీకి నీటిని వదులుతారు. ఫలితంగా.. విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు ఉన్న పంటలు, అటు గుంటూరు పరివాహక ప్రాంతంలోని సాగుకు కూడా కావాల్సినంత నీరు అందుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
This post was last modified on July 29, 2025 3:30 pm
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…