దేశంలో జనాభా ప్రస్తుత లెక్కల ప్రకారం.. 142 కోట్ల వరకు ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం.. 142 కోట్ల 9 లక్షల 30 వేలకు పైగానే జనాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్కరిపై.. లక్షా 32 వేల 59 రూపాయల చొప్పున అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో వెల్లడించింది. అయితే.. సొమ్మేమీ.. వ్యక్తిగతంగా ప్రజలు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్రజలకు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి చేసిన అప్పులు.
నాటి నుంచి తీసుకుంటున్న అప్పులను దేశంలోని ప్రతి ఒక్కరికీ.. చిన్నా, పెద్దా, పురుషుడు, మహిళ అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే.. ఒక్కొక్కరి తలపై 1.32 లక్షల వరకు అప్పు ఉందని ప్రభుత్వం వివరించింది. అయితే.. ఈ సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకోసమే తీసుకున్నామని కేంద్రం వెల్లడించడం గమనార్హం. అంతేకాదు.. దీనిలోనే రాష్ట్రాలకు కూడా అప్పులు ఇచ్చామని.. కేంద్రం ఒక్కటే ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఈ సొమ్మును దేశ అభివృద్ధి కోసం అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నట్టు వెల్లడించింది.
ఇక, ఈ సొమ్ముకు కడుతున్న వడ్డీలను కూడా కేంద్రం వెల్లడించింది. పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించిన వివరాల ప్రకారం..
+ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అప్పులకు.. కట్టిన వడ్డీ: 9.30 లక్షల కోట్లరూపాయలు
+ 2023-24లో కట్టిన వడ్డీ: 10.64 లక్షల కోట్ల రూపాయలు.
+ 2024-25 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీ: 11.18 లక్షల కోట్లు.
అయితే, ఈ అప్పులను 2031 సంవత్సరానికి జీడీపీలో 50 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 62 శాతంగా ఉందని తెలిపారు. ఇదిలావుంటే.. అప్పులు చేయడాన్ని కేంద్రం సమర్థించుకుంది. “పన్నులు విధిస్తే.. యాగీ చేస్తారు. అప్పులు చేస్తే తప్పంటారు. కానీ.. అభివృద్ధి మాత్రం జరగాలంటారు. ఇదేం చొద్యం. విపక్షాలకు మైండ్ పనిచేయడం లేదు“ అని తన ప్రత్యుత్తరంలో మంత్రి వ్యాఖ్యానించారు.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…