Political News

దేశంలో ఒక్కొక్క‌రిపై 1.32 ల‌క్ష‌ల అప్పు: కేంద్రం

దేశంలో జ‌నాభా ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. 142 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. 142 కోట్ల 9 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగానే జ‌నాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్క‌రిపై.. ల‌క్షా 32 వేల 59 రూపాయ‌ల చొప్పున అప్పు ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా పార్ల‌మెంటులో వెల్ల‌డించింది. అయితే.. సొమ్మేమీ.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర ప్ర‌భుత్వం 2014 నుంచి చేసిన అప్పులు.

నాటి నుంచి తీసుకుంటున్న అప్పుల‌ను దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ.. చిన్నా, పెద్దా, పురుషుడు, మ‌హిళ అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే.. ఒక్కొక్క‌రి త‌ల‌పై 1.32 ల‌క్షల వ‌ర‌కు అప్పు ఉంద‌ని ప్ర‌భుత్వం వివ‌రించింది. అయితే.. ఈ సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కోస‌మే తీసుకున్నామ‌ని కేంద్రం వెల్ల‌డించడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దీనిలోనే రాష్ట్రాల‌కు కూడా అప్పులు ఇచ్చామ‌ని.. కేంద్రం ఒక్క‌టే ఖ‌ర్చు చేయలేద‌ని వెల్ల‌డించింది. ఈ సొమ్మును దేశ అభివృద్ధి కోసం  అప్పు రూపంలో ప్ర‌పంచ బ్యాంకు స‌హా ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇక‌, ఈ సొమ్ముకు క‌డుతున్న వ‌డ్డీల‌ను కూడా కేంద్రం వెల్ల‌డించింది. పార్ల‌మెంటులో ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌధ‌రి వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..
+ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో అప్పుల‌కు.. క‌ట్టిన వ‌డ్డీ:  9.30 ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌లు

+ 2023-24లో క‌ట్టిన వ‌డ్డీ:  10.64 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు.

+ 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన వ‌డ్డీ:  11.18 ల‌క్ష‌ల కోట్లు.

అయితే, ఈ అప్పుల‌ను 2031 సంవత్స‌రానికి జీడీపీలో 50 శాతానికి తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. ప్ర‌స్తుతం ఇది జీడీపీలో 62 శాతంగా ఉంద‌ని తెలిపారు. ఇదిలావుంటే.. అప్పులు చేయ‌డాన్ని కేంద్రం స‌మ‌ర్థించుకుంది. “ప‌న్నులు విధిస్తే.. యాగీ చేస్తారు. అప్పులు చేస్తే త‌ప్పంటారు. కానీ.. అభివృద్ధి మాత్రం జ‌ర‌గాలంటారు. ఇదేం చొద్యం. విప‌క్షాల‌కు మైండ్ ప‌నిచేయ‌డం లేదు“ అని త‌న ప్ర‌త్యుత్త‌రంలో మంత్రి వ్యాఖ్యానించారు.

This post was last modified on July 29, 2025 3:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: India's Debt

Recent Posts

రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…

28 minutes ago

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

5 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

6 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

7 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

7 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

9 hours ago