Political News

సింగపూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా.. చంద్ర‌బాబు

“సింగ‌పూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా. ఒక‌ప్పుడు నేను చేసిన ఆలోచ‌న‌తోనే మీరు సింగ‌పూర్ లో సెటిల్ అయ్యేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. నేను ఎప్పుడూ.. రాబోయే 30 ఏళ్ల గురించే ఆలోచిస్తా. ఆ ఆలోచ‌నతోనే నాడు.. ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ఫ‌లితంగా.. మీరంతా ఇక్క‌డ‌కు వ‌చ్చి.. మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆలోచ‌న చేస్తున్నా.. మీరు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టండి. పీ-4 ప‌థ‌కంలో భాగ‌స్వాములు కండి“ అని సీఎం చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం.. సింగ‌పూర్‌లోని ఓవిస్ డిజిట‌ల్ క్యాంప‌స్‌లో తెలుగు డ‌యాస్పోరా స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్నారై వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు డాక్ట‌ర్ వేమూరి ర‌వికుమార్ నేతృత్వంలో సింగ‌పూర్ ఎన్ ఆర్ టీ, గ‌ల్ఫ్ అధ్య‌క్షులు రాధా కృష్ణ ర‌వి సార‌థ్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి 1500 మందిని ఆహ్వానించారు. అయితే.. మ‌రో రెండు మూడు వంద‌ల మంది అదికంగానే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా తెలుగు వారిని ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించారు.

సింగ‌పూర్‌లోని తెలుగు ప్ర‌జ‌ల ఉత్సాహం, ఆనందం.. రాష్ట్రానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో ప‌ర్య‌టిస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి తెలుగు వారు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఒక‌ప్పుడు.. తాను ఐటీని తీసుకువ‌చ్చాన‌ని అన్నారు. ఇప్పుడు పేద‌రిక నిర్మూల‌న‌పై యుద్ధం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే పీ4ను తీసుకువ‌చ్చామ‌ని.. దీనిలో సింగ‌పూర్‌లోని తెలుగు వారు కూడా చేతులు క‌ల‌పాల‌ని కోరారు. గ‌తంలోతాను తీసుకువ‌చ్చిన ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో చ‌దువుకున్న వారిలో చాలా మంది ఇప్పుడు సింగ‌పూర్ స‌హా వివిధ దేశాల్లో ప‌నులు చేసుకుంటూ.. బాగున్నార‌ని తెలిపారు.

రానున్న ఫ్యూచ‌ర్ ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీగా ఉంటుంద‌న్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్‌ చేయాలని ఆలోచించి.. ఆదిశ‌గా ఇప్ప‌టికే అడుగులు వేశామ‌న్నారు. ఎన్నార్టీ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు వారంతా ఏక‌తాటిపైకి రావ‌డం.. గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలిపారు. సింగపూర్‌లో 40వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని చెప్పారు. ఏపీలో ఇప్పుడు సుప‌రిపాల‌న సాగుతోంద‌ని.. తెలుగు వారు వ‌చ్చి ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. పీ4లో పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుని తెలుగు నేలరుణం తీర్చుకోవాల‌ని కోరారు.

This post was last modified on July 27, 2025 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

16 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

48 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

54 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

1 hour ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago