Political News

‘బీఆర్ఎస్ పోయి.. జాగృతి, కేటీఆర్ పోయి జైశంక‌ర్‌’

బీఆర్ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. రాష్ట్రంలో స‌మ‌స్య‌లపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసేందుకు తెలంగాణ జాగృతి మాత్ర‌మే ముందుకు వ‌స్తోంద‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ‘లీడ‌ర్‌’ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. దీనికి సంబంధించి కొన్ని మార్పులు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్క‌డా బీఆర్ఎస్ జెండా కానీ.. గులాబీ రంగులు కానీ.. క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద పోస్ట‌ర్ల‌పై కేసీఆర్ ఫొటో, ఆ ప‌క్కన ప్రొఫెస‌ర్ జైశంక‌ర్ ఫొటోల‌కు మాత్ర‌మే చోటు క‌ల్పించారు.

మ‌రి కేటీఆర్ ఫొటో ఏమైన‌ట్టు? అనేది స‌భ‌కు వచ్చిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేశారు. జాగృతి త‌ర‌ఫున పోరాటాలు బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పిన క‌విత‌.. త‌న ప్ర‌సంగం మొత్తంలో ఎక్క‌డా బీఆర్ఎస్ పేరును ప్ర‌స్థావించ‌క పోవ‌డం కూడా విశేషం. వాస్త‌వానికి క‌విత త‌న సోద‌రుడు కేటీఆర్‌తో విభేదిస్తున్నా.. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ల పేర్ల‌ను త‌ర‌చుగా ప్ర‌స్తావిస్తున్నారు. కానీ, ఇటీవ‌ల ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌విత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు.. అనంత‌రం జ‌రిగిన దాడి.. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ నాయ‌కులు మౌనంగా ఉండ‌డం వంటి ప‌రిణామాల‌తో క‌విత పూర్తిగా యూట‌ర్న్‌తీసుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

అంటే.. దాదాపు క‌విత ఇక‌, ఒంట‌రి పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా నిర్వ‌హించిన ‘లీడ‌ర్‌’ కార్య‌క్ర‌మంలో కేసీఆర్ ఫొటో మాత్ర‌మే(అది కూడా చాలా చిన్న‌ది).. పెట్టి కేటీఆర్ ఫొటోకానీ.. ఆయ‌న పేరును కానీ.. ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం.. ఎక్క‌డా బీఆర్ఎస్ జెండాలు కూడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, త‌న ప్ర‌సంగంలో కేవ‌లం జాగృతి మాత్ర‌మే ప‌నిచేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై జాగృతి మాత్ర‌మే ఉద్య‌మిస్తోంద‌ని.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌ద్వారా బీఆర్ఎస్ ను ఆమె ప‌రోక్షంగా టార్గెట్ చేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ అస్థిత్వాన్ని క‌విత ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌ను తిట్టిపోయిన వారికి, ఆ భాష‌ను విమ ర్శించిన వారికి తాజాగా అవార్డులు ఇచ్చార‌న్న ఆమె.. ఈ వ్య‌వ‌హారంలోనూ .. తాను మాత్ర‌మే పోరాడాన‌ని సెల్ఫ్ గోల్ చేసుకు న్నారు. అంటే.. ఇక‌, తెలంగాణ కోసం పోరాడేది.. నిలిచేది కూడా తానేన‌ని ఆమె ప‌రోక్షంగా ప్ర‌చారం చేసుకున్న‌ట్టు అయింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. క‌విత‌.. సింగిల్ జెండా.. అజెండాను రూపొందించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on July 27, 2025 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

9 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

46 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago