Political News

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం: జ‌గ‌న్

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక్క‌రూపాయి కూడా సృష్టించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. పైగా.. అప్పులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయ‌న్నారు. దీనివ‌ల్ల రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌ల కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) ఇచ్చిన నివేదిక‌ను వివ‌రించారు. దీనిలో పేర్కొన్న గ‌ణాంకాలు తాము చెబుతున్న‌వి కాద‌ని.. కేంద్రంలో ఏ ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇస్తున్నారో.. ఆ ప్ర‌భుత్వం నేతృత్వంలోని కాగ్ సంస్థ ఇచ్చిన‌వేన‌ని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుత 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని కాగ్ పేర్కొన్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం లేక‌పోగా.. ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ కూడా సరిగా లేద‌ని కాగ్ వివ‌రించింద‌న్నారు. ప్ర‌స్తుతం అప్పుల కుప్పగా మారిపోయింద‌న్నారు. తొలి మూడు మాసాల్లో జీఎస్టీ ఆదాయం దారుణంగా ప‌డిపోయింద‌న్నారు. సేల్స్ ట్యాక్స్ స‌హా.. ఇత‌ర ప‌న్నుల ఆదాయం కూడా.. త‌మ వైసీపీ హ‌యాంతో పోల్చుకుంటే ఇప్పుడు దారుణంగా త‌గ్గిపోయాయ‌ని చెప్పారు. రాష్ట్రం ప్ర‌భుత్వ ఆదాయం 3.47 శాతం మాత్ర‌మే పెరిగింద‌న్న జ‌గ‌న్‌.. కేంద్రం నుంచి వ‌స్తున్న సొమ్ముల‌ను కూడా త‌మ ఖాతాలో వేసుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌లు చెబుతోంద‌న్నారు.

మ‌రోవైపు.. అప్పులు చాలా వేగంగా పెరుగుతున్నాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు మాసాల్లో 15 శాతం మేర‌కు అప్పులు పెరిగిపోయాయ‌న్నారు. ఇది గ‌త ఐదేళ్ల త‌మ ప్ర‌భుత్వం చేసిన అప్ప‌ట్లో స‌గంగా ఉంద‌న్నా రు. ఇది దారుణం కాదా? అని ప్ర‌శ్నించారు. పైగా ఏ ప‌నికావాల‌న్నా.. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింద‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అవినీతిలో కూరుకుపోయార‌ని చెప్పారు. “ఆదాయం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. దీనికితోడు అవినీతి కూడా పెరుగుతోంది. ఇదేనా సంప‌ద సృష్టి” అని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

కాగా.. జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై టీడీపీ కౌంట‌ర్ ఇచ్చింది. పెట్టుబ‌డులు వ‌స్తే.. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌ని చెప్పారు. కానీ, ఈ పెట్టుబ‌డులు రాకుండా.. జ‌గ‌న్ అడ్డుకుంటున్నార‌ని అన్నారు. అందుకే.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు, సంప‌ద పెరిగేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది మాత్ర‌మే అయింద‌ని.. ఈ ఏడాది కాలంలో వైసీపీ చేసిన విధ్వంసాన్నిస‌రిదిద్ద‌డంతోనే స‌రిపోయింద‌ని నాయ‌కులు దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on July 27, 2025 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago