Political News

నేను కూడా ద‌త్త‌త తీసుకుంటా.. విమ‌ర్శ‌ల‌కు చంద్ర‌బాబు చెక్‌

పీ-4 పథకంలో భాగంగా పేదలను దత్తత తీసుకోవాలని పలువురిని సీఎం చంద్రబాబు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పీ-4 పథకం కింద నారా కుటుంబమే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా! అని ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు, వాటికి చెక్ పెట్టారు. తాను కూడా పీ-4 కింద కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పీ-4 పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని స్పష్టంచేశారు.

ఆగస్టు 10వ తేదీ నాటికి పేదల (బంగారు కుటుంబాలు) గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, ఎటువంటి విమర్శలకు తావు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

“ప్రతిపక్షం మనం మంచి చేస్తే కూడా విమర్శలు చేస్తోంది. అలాంటి అవకాశాలు ఇవ్వకుండా కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తప్పులు జరగకుండా చూడాలి. నేను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాను,” అని చంద్రబాబు పేర్కొన్నారు.

పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విషయంలో చర్చించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి మొత్తం 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇప్పటివరకు ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన 57,000 మంది వ్యక్తులు పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని అధికారులు వివరించారు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి, వారి సేవలను ప్రజల ముందు ప్రదర్శించాలని, తద్వారా మరిన్ని మంది ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహం కలిగించాలని చంద్రబాబు సూచించారు.

పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చారని, ఇతర జిల్లాల్లోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నామని, పీ-4 పథకంపై ఉన్న సందేహాలు, విమర్శలను వెంటనే నివృత్తి చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

8 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

9 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

10 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

10 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

10 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

11 hours ago