పీ-4 పథకంలో భాగంగా పేదలను దత్తత తీసుకోవాలని పలువురిని సీఎం చంద్రబాబు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పీ-4 పథకం కింద నారా కుటుంబమే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా! అని ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు, వాటికి చెక్ పెట్టారు. తాను కూడా పీ-4 కింద కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పీ-4 పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని స్పష్టంచేశారు.
ఆగస్టు 10వ తేదీ నాటికి పేదల (బంగారు కుటుంబాలు) గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, ఎటువంటి విమర్శలకు తావు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
“ప్రతిపక్షం మనం మంచి చేస్తే కూడా విమర్శలు చేస్తోంది. అలాంటి అవకాశాలు ఇవ్వకుండా కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తప్పులు జరగకుండా చూడాలి. నేను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాను,” అని చంద్రబాబు పేర్కొన్నారు.
పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విషయంలో చర్చించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి మొత్తం 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇప్పటివరకు ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన 57,000 మంది వ్యక్తులు పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని అధికారులు వివరించారు. వారి వివరాలను ఆన్లైన్లో ఉంచి, వారి సేవలను ప్రజల ముందు ప్రదర్శించాలని, తద్వారా మరిన్ని మంది ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహం కలిగించాలని చంద్రబాబు సూచించారు.
పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చారని, ఇతర జిల్లాల్లోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ల ద్వారా సమాచారం అందిస్తున్నామని, పీ-4 పథకంపై ఉన్న సందేహాలు, విమర్శలను వెంటనే నివృత్తి చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on July 25, 2025 10:04 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…