పీ-4 పథకంలో భాగంగా పేదలను దత్తత తీసుకోవాలని పలువురిని సీఎం చంద్రబాబు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పీ-4 పథకం కింద నారా కుటుంబమే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా! అని ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు, వాటికి చెక్ పెట్టారు. తాను కూడా పీ-4 కింద కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పీ-4 పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని స్పష్టంచేశారు.
ఆగస్టు 10వ తేదీ నాటికి పేదల (బంగారు కుటుంబాలు) గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, ఎటువంటి విమర్శలకు తావు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
“ప్రతిపక్షం మనం మంచి చేస్తే కూడా విమర్శలు చేస్తోంది. అలాంటి అవకాశాలు ఇవ్వకుండా కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తప్పులు జరగకుండా చూడాలి. నేను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాను,” అని చంద్రబాబు పేర్కొన్నారు.
పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విషయంలో చర్చించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి మొత్తం 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇప్పటివరకు ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన 57,000 మంది వ్యక్తులు పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని అధికారులు వివరించారు. వారి వివరాలను ఆన్లైన్లో ఉంచి, వారి సేవలను ప్రజల ముందు ప్రదర్శించాలని, తద్వారా మరిన్ని మంది ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహం కలిగించాలని చంద్రబాబు సూచించారు.
పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చారని, ఇతర జిల్లాల్లోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ల ద్వారా సమాచారం అందిస్తున్నామని, పీ-4 పథకంపై ఉన్న సందేహాలు, విమర్శలను వెంటనే నివృత్తి చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on July 25, 2025 10:04 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…