వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన అనంతబాబు తన సొంత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు 2022లో రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది.
హత్య చేయడంతో పాటు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును తాజాగా పునర్విచారణ చేయాలంటూ రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసును తిరగదోడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా నియమించింది. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు అనంతబాబును విచారించేందుకు రెడీ అయ్యారు.
అయితే ఈ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే విచారణ పూర్తైందని, పునర్విచారణ అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
అయితే హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. “ఈ కేసులో కుట్ర కోణం ఉంది. ఆర్థిక లావాదేవీలు సహా ఇతర కారణాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. అందుకే మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది” అని బాధిత కుటుంబ తరఫున న్యాయవాది వాదించారు.
బాధితుల తరఫున వాదించిన న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది. “ఈ కేసు లోతుల్లోకి వెళితే తప్పేముంది? పిటిషనర్ ప్రమేయం లేకపోతే మీకే మంచిది కదా!” అంటూ కోర్టు అనంతబాబు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
ఇరు పక్షాల వాదనలు ముగియడంతో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకుండా హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, కేసును మరోసారి విచారించేందుకు ప్రభుత్వం సిట్ను నియమించింది. బాధితుల తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును కూడా నియమించారు.
10 లక్షల పరిహారం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించింది. అలాగే, కేసును పునర్విచారించాలన్న వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
అప్పట్లో వైసీపీ హయాంలో తూతూ మంత్రంగా విచారించారనీ, అనంతబాబు తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా, తగిన కారణాలు వెలికితీయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనివెనుక మరికొంత మంది ప్రమేయం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పునర్విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on July 25, 2025 8:51 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…