దేశానికి వరుసగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెల కొల్పారు. ఇదే సమయంలో గతంలో ఇదేవిధంగా సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ రికార్డును ఆయన అధిగమించారు. మరీ ముఖ్యంగా గాంధీయేతర వ్యక్తి ఇలా రికార్డు సమయం పాటు దేశాన్నిపాలించడం.. మరో సంచలన విషయం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రాజకీయ మైలురాయిని అధిగమించారు, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, ఒకే పదవిలో నిరంతరాయంగా కొనసాగిన 2వ ప్రధానిగా రికార్డు దక్కించుకున్నారు. జూలై 25, 2025 నాటికి ప్రధాని మోడీ 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు, జనవరి 1966- మార్చి 1977 మధ్య ఇందిరా గాంధీ వరుసగా 4,077 రోజులు ప్రధానిగా సేవలందించారు.
ఈ విజయం ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని నమోదు చేసింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. దాదాపు 24 సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఇది మరే ఇతర భారత ప్రధానమంత్రికి సాధ్యం కాని ఘనతగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ.. మోడీ ప్రత్యేకతలు..
This post was last modified on July 25, 2025 2:09 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…