Political News

అధికారిక వీడ్కోలూ లేదు.. సంచ‌ల‌నాల పుట్ట‌గా ‘జ‌గ‌దీప్’!

దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేసిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ వ్య‌వహారం.. విస్మ‌యానికి గురి చేస్తోంది. ఆయ‌న రాజీనామానే ఒక పెద్ద సంచ‌ల‌నం అయితే.. ఆ త‌ర్వాత‌.. జ‌రుగుతున్న ప‌రిణామాలు అంత‌కు మించిన సంచ‌ల‌నాలుగా మారుతున్నాయి. సాధార‌ణంగా.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వంటి పెద్ద ప‌ద‌వుల్లో ఉన్న వారు స‌డెన్‌గా రాజీనామా చేయ‌డం అనేది లేదు. ఒకే ఒక్క సారి వీవీ గిరి రాజీనామా చేసినా..ఆయ‌న రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ఆయ‌న రాజీనామా వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రాలేదు.

కానీ.. ఆ త‌ర్వాత‌.. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ ఒక్క‌రే.. 2 సంవ‌త్స‌రాల ప‌ద‌వీ కాలం ఉండ‌గా.. రాజీనామా స‌మ‌ర్పించారు. పైగా అదికూడా సాయంత్రం వ‌ర‌కు ..రాజ్య‌స‌భకు సంబంధించిన విధుల్లో ఉండి.. హ‌ఠాత్తుగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదొక సంచ‌ల‌న మైతే.. ఆయ‌న రాజీనామా చేసిన త‌ర్వాత‌.. క‌నీసం ఆయ‌న‌తో కేంద్రం కానీ.. రాష్ట్ర‌ప‌తి కానీ.. ఎక్క‌డా సంప్ర‌దింపులు.. చ‌ర్చ‌లు చేయ‌కుండానే చేసింది త‌డ‌వుగా రాజీనామాను ఆమోదించేశారు. ఇది మ‌రో సంచ‌ల‌నం.

ఇక‌, ఇప్పుడు మ‌రో విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి రాజీనామా అనంత‌రం.. ఆయ‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించి.. రాజ్య‌స‌భ‌లో గౌర‌వంగా ఆయ‌న గురించి నాలుగు ముక్క‌లు చెప్పి.. ప్ర‌శంసించి.. వీడ్కోలు ప‌లుకుతారు. ఇది గౌర‌వం… సంప్ర‌దాయం కూడా. తెలుగు నాయ‌కుడు వెంక‌య్య నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి విర‌మ‌ణ పొందిన‌ప్పుడు.. ఇలానే జ‌రిగింది. గ‌తంలో హమీద్ అన్సారీ(ఈయ‌న ప‌దేళ్లు చేశారు) విర‌మ‌ణ స‌మ‌యంలోనూ.. ఇలానే గౌర‌వంగా సాగ‌నంపారు.

కానీ.. ఇప్పుడు జ‌గ‌దీప్ విషయంలో కేంద్రం ఆ గౌర‌వాన్ని కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. వాస్తవానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి రాజీనామా చేసినా.. విర‌మ‌ణ పొందినా.. ప్ర‌భుత్వ ప‌క్షం ముందుకు వ‌చ్చి.. వీడ్కోలు కార్యక్ర‌మానికి శ్రీకారం చుడుతుంది. అన్ని ప‌క్షాల‌ను ఆహ్వానిస్తుంది. ఒక రోజు స‌భ‌ను కేటాయిస్తుంది. ఆ స‌భ‌లో ఆయ‌న‌ను ప్ర‌శంసించి సాగ‌నుంపుతారు. కానీ.. ఈ ద‌ఫా.. విప‌క్షాలే ముందుకు వ‌చ్చాయి. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌ను గౌర‌వంగా సంప్ర‌దాయ బద్ధంగా సాగ‌నంపేందుకు రెడీ అయ్యాయి.

దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. కానీ, కేంద్రం దీనిని ప‌క్క‌న పెట్టింది. అంటే.. జ‌గదీప్‌కు.. వీడ్కోలు స‌భ కానీ.. గౌర‌వ ప్ర‌ద‌మైన సాగ‌నంప‌డం.. కానీ.. లేవు. సో.. చేసుకున్న వారికి చేసుకున్నంత‌! అనే నానుడి జ‌గ‌దీప్ విష‌యంలో వినిపిస్తోంది. వాస్త‌వానికి ఆది నుంచి బీజేపీని ఆయ‌న మోశారు. ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అయిన త‌ర్వాత‌.. ధ‌న్‌ఖ‌డ్‌.. కేంద్రంలోని మోడీ స‌ర్కారును అధికార పార్టీ నాయ‌కుల కంటే ఎక్కువ‌గా స‌మ‌ర్థించారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌పై కూడా ఆయ‌న వ్యాఖ్య‌లు చేసి.. వివాద‌మ‌య్యారు. అభిసంశన తీర్మానం కూడా ఎదుర్కొన్నారు. ఇవ‌న్నీ.. ఆయ‌న ఎవ‌రి కోసం చేశారంటే.. బీజేపీ కోసం.. మోడీ కోసమే!. కానీ.. ఇప్పుడు వారే ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌న్న‌ది జాతీయ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.

This post was last modified on July 25, 2025 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

46 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

4 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

7 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

8 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

8 hours ago