Political News

50 వేల కావాలా.. అయితే ఈ ప‌నిచేయండి: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం జ‌నాభా పెంపుద‌ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జ‌ల‌కు సీఎం ప‌దే ప‌దే పిల్ల‌ల‌ను క‌నాల‌ని గ‌త ఏడాది కాలంగా చెబుతున్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న ప‌న్నుల వాటా జ‌నాభా ప్రాతిప‌దిక‌నే ఉండ‌డం, జ‌నాభా ఆధారంగానే భ‌విష్య‌త్తులోనూ ఇదే ప్రాతిప‌దిక‌న నిధులు కేటాయింపు జ‌రుగుతుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టితో ఈ ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నా రు. అయితే.. ప్ర‌జ‌ల్లో ఆమేర‌కు చైతన్యం రాలేదు. దీంతో ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో జ‌నాభా పెరుగుద‌ల‌పై కూడా సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌తో చ‌ర్చించారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీకి సంబంధించిన‌ ముసాయిదా సిద్ధ‌మ‌వు తోంద‌న్న సీఎం.. దీనిపై అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యం లో ప్ర‌భుత్వం వైపు నుంచి ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించారు.

ఇవీ.. ప్రోత్సాహ‌కాలు..

1) ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు.
2) ప్ర‌భుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌కు ప్రసూతి వేత‌నంతో కూడిన సెలవులు ఏడాది పాటు ఇస్తారు.
3) పురుషుల‌కు కూడా కుటుంబ నిర్వ‌హ‌ణ సెల‌వుల పేరుతో.. 6-8 నెల‌లు వేత‌నంతో కూడిన సెల‌వులు ఇస్తారు.
4) ఆత‌ర్వాత‌.. ఏడాది పాటు.. బాలింత‌ల‌కు.. వ‌ర్క్ ఫ్రం హోం స‌దుపాయం క‌ల్పిస్తారు.
5) మూడో బిడ్డ నుంచి ఎంత మంది పిల్ల‌ల‌ను కంటే.. అంద‌రికీ.. త‌ల‌కు రూ.50 వేల చొప్పున ఆ కుటుంబ ఖాతాలో బిడ్డ పుట్టిన రోజే ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంది.
6) ఐవీఎఫ్ ద్వారా పిల్ల‌ల‌ను క‌నేవారికి కూడా ప్ర‌భుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది. ఇదిఎంత అనేది త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తారు.
7) ముగ్గురుకి మించి పిల్ల‌లు ఉన్న త‌ల్లుల‌కు.. రాష్ట్రంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా.. ఐదేళ్ల‌పాటు ఉచితంగా ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ప్ర‌త్యేక ఆర్టీసీ బ‌స్ పాస్‌(ల‌గ్జ‌రీ బ‌స్సులు) ఇస్తారు.

This post was last modified on July 25, 2025 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

15 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

21 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

32 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

1 hour ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

4 hours ago