Political News

50 వేల కావాలా.. అయితే ఈ ప‌నిచేయండి: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం జ‌నాభా పెంపుద‌ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జ‌ల‌కు సీఎం ప‌దే ప‌దే పిల్ల‌ల‌ను క‌నాల‌ని గ‌త ఏడాది కాలంగా చెబుతున్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న ప‌న్నుల వాటా జ‌నాభా ప్రాతిప‌దిక‌నే ఉండ‌డం, జ‌నాభా ఆధారంగానే భ‌విష్య‌త్తులోనూ ఇదే ప్రాతిప‌దిక‌న నిధులు కేటాయింపు జ‌రుగుతుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టితో ఈ ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నా రు. అయితే.. ప్ర‌జ‌ల్లో ఆమేర‌కు చైతన్యం రాలేదు. దీంతో ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో జ‌నాభా పెరుగుద‌ల‌పై కూడా సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌తో చ‌ర్చించారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీకి సంబంధించిన‌ ముసాయిదా సిద్ధ‌మ‌వు తోంద‌న్న సీఎం.. దీనిపై అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యం లో ప్ర‌భుత్వం వైపు నుంచి ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించారు.

ఇవీ.. ప్రోత్సాహ‌కాలు..

1) ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు.
2) ప్ర‌భుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌కు ప్రసూతి వేత‌నంతో కూడిన సెలవులు ఏడాది పాటు ఇస్తారు.
3) పురుషుల‌కు కూడా కుటుంబ నిర్వ‌హ‌ణ సెల‌వుల పేరుతో.. 6-8 నెల‌లు వేత‌నంతో కూడిన సెల‌వులు ఇస్తారు.
4) ఆత‌ర్వాత‌.. ఏడాది పాటు.. బాలింత‌ల‌కు.. వ‌ర్క్ ఫ్రం హోం స‌దుపాయం క‌ల్పిస్తారు.
5) మూడో బిడ్డ నుంచి ఎంత మంది పిల్ల‌ల‌ను కంటే.. అంద‌రికీ.. త‌ల‌కు రూ.50 వేల చొప్పున ఆ కుటుంబ ఖాతాలో బిడ్డ పుట్టిన రోజే ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంది.
6) ఐవీఎఫ్ ద్వారా పిల్ల‌ల‌ను క‌నేవారికి కూడా ప్ర‌భుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది. ఇదిఎంత అనేది త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తారు.
7) ముగ్గురుకి మించి పిల్ల‌లు ఉన్న త‌ల్లుల‌కు.. రాష్ట్రంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా.. ఐదేళ్ల‌పాటు ఉచితంగా ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ప్ర‌త్యేక ఆర్టీసీ బ‌స్ పాస్‌(ల‌గ్జ‌రీ బ‌స్సులు) ఇస్తారు.

This post was last modified on July 25, 2025 10:58 am

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

28 minutes ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

32 minutes ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

1 hour ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

1 hour ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

2 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

3 hours ago