Political News

సింగ‌పూర్ బ్రాండ్ ఏపీ.. రోడ్ షో.. బాబు ఏం చేస్తారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు శ‌నివారం నుంచి సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న వెంట మంత్రులు నారా లోకేష్‌, టీజీ భ‌ర‌త్‌(ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ మంత్రి).. స‌హా అధికారులు వెళ్ల‌నున్నారు. అయితే.. ఈ సారి పూర్తిగా పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌న‌పైనే చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌నున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వ‌హించనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు సీఎం చంద్ర‌బాబు బృందం సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించ‌నుంది.

దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత‌ దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వంద‌ల కోట్ల పెట్టు బ‌డులు తెచ్చిన‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్ర‌వేశించిన ప్రారంభంలోనే విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్, వంటివి వివ‌రించి.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆక‌ర్షించ‌నున్నారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, సుదీర్ఘ‌ తీర ప్రాంతం, నిపుణు లైన మానవ వనరులు ఉన్న ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌ర‌లి రావాల‌ని సింగ‌పూర్ పారిశ్రామిక వేత్త‌ల‌కు సీఎం చంద్ర‌బాబు బృందం వివ‌రించ‌నుంది. మొత్తం 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంత‌రం.. రోడ్ షో నిర్వ‌హించి.. పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించ‌నున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.

This post was last modified on July 25, 2025 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

25 minutes ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

1 hour ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

2 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

4 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

5 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

5 hours ago