ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు మాస్టర్ మైండ్.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగనేనని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో మాణిక్కం ఎక్స్లో స్పందించారు. 3200 కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దోచుకున్నారని తెలిపారు. ఈ సొమ్మును ఎన్నికల్లో ఖర్చుచేసి.. ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు.
అయితే..మద్యం కేసులో ఇంతమంది అరెస్టు అవుతున్నా.. జగన్కు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అసలు మాస్టర్ మైండ్ జగనేనని.. మిథున్ రెడ్డి కేవలం ఆటలో అరిటి పండులాగా.. ఒక పావు మాత్రమేనని మాణిక్కం చెప్పారు. జగన్, ఆయన భార్య భారతిలు.. అక్రమంగా సంపాయించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారని.. తద్వారా దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని మాణిక్కం ఆరోపిం చారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సి అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా ఈ మద్యం కేసులో కేవలం డబ్బు మాత్రమే కాదని.. కోటి మంది ప్రజల కుటుంబాలతోనూ వైసీపీ నాయకులు ఆడుకున్నారని మాణిక్కం ఆరోపించారు. 30 వేల మందికిపైగా నకిలీ మద్యం తాగి మృతి చెందారని గతంలోనే తాము గణాంకాల సయితంగా వివరించామన్నారు. ఈ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేయించి.. దోషులను కఠినంగా శిక్షించాలని మాణిక్కం డిమాండ్ చేశారు. ముఖ్యంగా మాస్టర్ మైండ్ వంటి జగన్ను అసలు వదిలి పెట్టవద్దని సూచించారు.
This post was last modified on July 20, 2025 3:23 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…