Political News

‘జ‌గ‌న్‌.. మాస్ట‌ర్ మైండ్‌’

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో అస‌లు మాస్ట‌ర్ మైండ్‌.. ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌నేన‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో మాణిక్కం ఎక్స్‌లో స్పందించారు. 3200 కోట్ల రూపాయ‌ల‌ను వైసీపీ నాయ‌కులు దోచుకున్నార‌ని తెలిపారు. ఈ సొమ్మును ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుచేసి.. ఓట్లు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు.

అయితే..మ‌ద్యం కేసులో ఇంత‌మంది అరెస్టు అవుతున్నా.. జ‌గ‌న్‌కు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. అస‌లు మాస్ట‌ర్ మైండ్ జ‌గ‌నేన‌ని.. మిథున్ రెడ్డి కేవ‌లం ఆట‌లో అరిటి పండులాగా.. ఒక పావు మాత్ర‌మేన‌ని మాణిక్కం చెప్పారు. జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తిలు.. అక్ర‌మంగా సంపాయించిన సొమ్మును ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేశార‌ని.. త‌ద్వారా దొడ్డి దారిలో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని మాణిక్కం ఆరోపిం చారు. ఈ కేసును మ‌రింత లోతుగా విచారించాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు.

ముఖ్యంగా ఈ మ‌ద్యం కేసులో కేవ‌లం డ‌బ్బు మాత్ర‌మే కాద‌ని.. కోటి మంది ప్ర‌జ‌ల కుటుంబాల‌తోనూ వైసీపీ నాయ‌కులు ఆడుకున్నార‌ని మాణిక్కం ఆరోపించారు. 30 వేల మందికిపైగా న‌కిలీ మ‌ద్యం తాగి మృతి చెందార‌ని గ‌తంలోనే తాము గ‌ణాంకాల స‌యితంగా వివ‌రించామ‌న్నారు. ఈ దిశ‌గా కూడా ప్ర‌భుత్వం విచార‌ణ చేయించి.. దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మాణిక్కం డిమాండ్ చేశారు. ముఖ్యంగా మాస్ట‌ర్ మైండ్ వంటి జ‌గ‌న్‌ను అస‌లు వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని సూచించారు.

This post was last modified on July 20, 2025 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

15 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

18 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago