Political News

‘జ‌గ‌న్‌.. మాస్ట‌ర్ మైండ్‌’

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో అస‌లు మాస్ట‌ర్ మైండ్‌.. ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌నేన‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో మాణిక్కం ఎక్స్‌లో స్పందించారు. 3200 కోట్ల రూపాయ‌ల‌ను వైసీపీ నాయ‌కులు దోచుకున్నార‌ని తెలిపారు. ఈ సొమ్మును ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుచేసి.. ఓట్లు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు.

అయితే..మ‌ద్యం కేసులో ఇంత‌మంది అరెస్టు అవుతున్నా.. జ‌గ‌న్‌కు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. అస‌లు మాస్ట‌ర్ మైండ్ జ‌గ‌నేన‌ని.. మిథున్ రెడ్డి కేవ‌లం ఆట‌లో అరిటి పండులాగా.. ఒక పావు మాత్ర‌మేన‌ని మాణిక్కం చెప్పారు. జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తిలు.. అక్ర‌మంగా సంపాయించిన సొమ్మును ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేశార‌ని.. త‌ద్వారా దొడ్డి దారిలో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని మాణిక్కం ఆరోపిం చారు. ఈ కేసును మ‌రింత లోతుగా విచారించాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు.

ముఖ్యంగా ఈ మ‌ద్యం కేసులో కేవ‌లం డ‌బ్బు మాత్ర‌మే కాద‌ని.. కోటి మంది ప్ర‌జ‌ల కుటుంబాల‌తోనూ వైసీపీ నాయ‌కులు ఆడుకున్నార‌ని మాణిక్కం ఆరోపించారు. 30 వేల మందికిపైగా న‌కిలీ మ‌ద్యం తాగి మృతి చెందార‌ని గ‌తంలోనే తాము గ‌ణాంకాల స‌యితంగా వివ‌రించామ‌న్నారు. ఈ దిశ‌గా కూడా ప్ర‌భుత్వం విచార‌ణ చేయించి.. దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మాణిక్కం డిమాండ్ చేశారు. ముఖ్యంగా మాస్ట‌ర్ మైండ్ వంటి జ‌గ‌న్‌ను అస‌లు వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని సూచించారు.

This post was last modified on July 20, 2025 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago