వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోకుండా.. తాము ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు.. వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు? అంటూ.. హైకోర్టును ప్రశ్నించింది.
ప్రభుత్వం తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని.. అలాంటిది అసలు వాదనలే వినకుండా.. ఒక వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని వ్యాఖ్యానించింది. ఇదేసమయంలో వంశీని తిరిగి అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను కూడా పక్కన పెట్టి.. కేసులో వాదనలు వినిపించాలని పేర్కొంది.
తిరిగి ఈ కేసును విచారించాలని.. ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నెల రోజుల్లో మరోసారి ప్రభుత్వ వాదనలు విని.. మరోసారి తీర్పు చెప్పాలని హైకోర్టును ఆదేశించింది. అయితే.. తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని.. పేర్కొంది. ముందస్తు బెయిల్ ఇచ్చేముందు.. కేసు పూర్వాపరాలతో పాటు.. నిందితుడిపై ఉన్న అభియోగాలు.. పూర్వ చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఏం జరిగింది?
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సుమారు.. 7 నెలలపాటు జైల్లోనే ఉన్నారు. ఆయనపై 6 కేసులు నమోదయ్యాయి. తొలి దఫా 5 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక, చివరి కేసు.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలతో ఇళ్లను పంపిణీ చేశారన్న కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తీవ్ర అభియోగాలు ఉన్నాయని.. అలాంటప్పుడు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
This post was last modified on July 17, 2025 1:25 pm
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…