తాజాగా రాష్ట్రంలో మరో సర్వే రిపోర్టు వెలుగు చూసింది. 120 నియోజకవర్గాలు, 20 మంది మత్రులపై చేపట్టిన సర్వే.. తాజాగా ఫలితాలను వెల్లడించింది. గతంలో వచ్చిన సర్వేలకు.. ఇప్పటి సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గత సర్వేలు కేవలం రెండు మాసాల కిందటే వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ రెండు మాసాల వ్యవధిలో చేపట్టిన సర్వేలో.. మరికొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మంత్రుల విషయంపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
గత రెండు సర్వేల్లో అంతా బాగున్న జాబితాలో 12 మంది మంత్రులు ఉన్నారు. ఆరెంజ్(ఓమాదిరి) జాబితాలో 10 మంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు వచ్చిన జాబితాలో అస్సలేమీ బాగోలేదు.. అని పేర్కొన్న జాబితా లో 10 మంది ఉన్నారన్నది సర్వే స్పష్టం చేసింది. అయితే.. వారి పేర్లు వెల్లడించకపోయినా.. వీరిపై మాత్రం ప్రజల్లోనేకాదు.. పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని తెలపడం గమనార్హం. పార్టీ నాయకులు కూడా .. ఈ పదిమందిలో నలుగురిని ఇప్పటికిప్పుడు మార్చేయాలని కోరుకుంటున్నట్టు సర్వే చెప్పడం గమనార్హం.
వీరిలో తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు, గుంటూరు జిల్లాలు కూడా ఉన్నాయని సర్వే పేర్కొంది. అయితే .. పేర్లు మాత్రం బహిరంగం చేయలేదు. వీరి పనితీరుపై చంద్రబాబు కూడా అసహనంతో ఉన్నమాట వాస్తవమేనని టీడీపీ సీనియర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిపింది. వీరిని ఇలానే కొనసాగిస్తే.. పార్టీ ప్రభావం ఎలా ఉన్నా.. ప్రభుత్వం పరంగా ఇబ్బందులు తప్పవని.. ప్రజలలో సింపతీ పోయే ప్రమాదం ఉందని పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇప్పటికిప్పుడు మారుస్తారా? అనేది ప్రశ్న.
ఇదిలావుంటే.. సదరు 10 మంది మంత్రులపై వస్తున్న అభియోగాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని సర్వే పేర్కొంది. ఆదాయంపైనే ఎక్కువ మంది మంత్రులు దృష్టి పెట్టారని తెలిపింది. నిరంతరం.. ఆదాయం పైనే దృష్టి పెట్టడంతోపాటు.. దీనికి సంబంధించి కొందరిని నియమించుకున్నట్టుగా కూడా తెలిపింది. ప్రజలకు చేరువ కాకుండా.. సొంత పనులు చేసుకునే వారు వీరిలో నలుగురు ఉండగా.. ప్రజల మధ్య ఉండీ.. ఉన్నా.. లేనట్టుగా వ్యవహరిస్తున్న వారు మరోనలుగురు ఉన్నారని తెలిపింది. ఇక, మరో ఇద్దరు.. అసలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…