మెగాస్టార్ చిరంజీవి అంటే.. సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉందనడంలో సందేహం లేదు. పైగా వినమ్రుడు, వివాదరహితుడు కూడా. దీంతో ఆయన ఏం చెప్పినా.. ఏం చేయాలని అనుకున్నా..పనులు క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, చిత్రంగా.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మెగాస్టార్కే షాకిచ్చారు. ‘అయితే ఏంటి?’ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో చిరు.. హైకోర్టు వరకు వెళ్లి.. అధికారులను కదిలించారు.
ఏం జరిగింది?
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో చిరంజీవికి సొంత నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం లో 2000 సంవత్సరంలో సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసి.. ఇంటికి సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు. జీ+2 ఇల్లు కట్టుకున్నారు. అయితే.. దీనిని రెనోవేషన్ చేసుకోవాలని నిర్ణయించారు. దాదాపు పదిహేను సంవత్సరాలు అయిన నేపథ్యంలో రిటైనింగ్ వాల్తో పాటు.. మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టాలని భావించారు.
అయితే.. ఎక్కడ ఏం చేసినా.. ఇప్పుడు హైడ్రా దూకుడుగా ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకునేందుకు చిరంజీవి గత నెల 5న జీహెచ్ ఎంసీకి .. సదరు మార్పులకు సంబంధించి వివరిస్తూ.. అనుమతులు కోరారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకుని.. దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. కానీ, అనుమతులు మాత్రం రాలేదు. దీంతో అధికారులకు ఫోన్లు చేసినా స్పందించలేదట. ఇక, విధిలేని పరిస్థితిలో మెగాస్టార్.. హైకోర్టును ఆశ్రయించారు.
ఇలా.. తన ఇంటిని రెనోవేషన్ చేసుకోవాలని భావించానని.. అయినా.. అధికారులు తనకు అనుమతులు ఇవ్వడం లేదని.. కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకుని.. చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని అభ్యర్థించారు. దీనిని తాజాగా మంగళవారం విచారించిన కోర్టు.. జీహెచ్ఎంసీ అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా? అని నిలదీసింది. సాధ్యమైనంత త్వరగా.. చిరంజీవి ఇంటి రెనోవేషన్ పనులకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…