వరుసగా సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతూ వస్తున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కసారిగా 22 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా మరణాలు సంభవించలేదు. ఈరోజు ఏకంగా ముగ్గురు చనిపోయారు. వీరంతా హైదరాబాదుకు చెందినవారే. అయితే, ఆ ముగ్గురుకి ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. వారం తర్వాత కేసుల విజృంభణతో మళ్లీ ఇక్కడ కంగారు మొదలైంది. అయితే, చిన్న ఆశావహ పరిణామం ఏంటంటే…. ఈరోజు నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన కేసులే ఎక్కువ. ఈ ట్రెండు గత నాలుగైదు రోజులుగా కొనసాగుతోంది.
మూడ్రోజుల క్రితం కేవలం 2 కేసులు నమోదైనపుడు ఇక తెలంగాణలో కంట్రోలైపోయిందనుకున్న జనం తాజాగా 22 అయిపోయేసరికి… ఈ కరోనా దరిద్రం మనల్ని అంత సులువుగా వదిలే పరిస్థితి కనిపించడం లేదని అర్థమవుతోంది. తెలంగాణ మంచి చర్యలు తీసుకుంటోంది అని ఈరోజే కేంద్రం తెలంగాణ పనితీరును ప్రశంసించింది. ఆ గుడ్ న్యూస్ విన్న కొన్ని గంటల్లోనే ఇలా భారీగా కేసులు మరణాలు సర్కారును డిజప్పాయింట్ చేశాయి.
ఎందుకోగాని కేసులను బాగా కంట్రోల్ చేస్తున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక లాగా గవర్నమెంటు డీటెయిల్డ్ రిపోర్టులు ఇవ్వడం లేదు. కేవలం సింగిల్ పేజీలో చాలా తక్కువ సమాచారంతో సరిపెడతున్నారు. అదే ఆయా రాష్ట్రాలు టెస్టులతో సహా ప్రతిదీ డీటెయిల్డుగా ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ దానిని ఫాలో కావడం లేదు. మరోవైపు కేంద్రం నిబంధనలు సడలించుకుంటూ పోతుంటే… రాష్ట్రం మాత్రం వాటిని పట్టించుకోకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. చివరకు అత్యధిక కేసులున్న మహారాష్ట్ర కూడా కొన్ని చోట్ల నిబంధనలు సడలించింది. అయితే కేసీఆర్ మాత్రం అస్సలు రిస్కు తీసుకోవడం లేదు. అమెరికా నుంచి ఆంధ్ర వరకు అందరూ సిట్యుయేషన్ సీరియస్ గా ఉన్నా నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా మనసు మార్చుకుంటాడేమో అన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on May 1, 2020 2:40 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…