ఏపీలోని గిరిజన ప్రాంతాలలో ప్రజలకు అనారోగ్యం వస్తే చాలు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అడవులు, కొండలు, వాగులు, వంకలు, డొంకలు దాటుకుంటూ డోలీలో రోగిని మోసుకు పోవాలన్న ఆలోచన వస్తే చాలు వారు వణికిపోతుంటారు. ఇక, గర్భిణుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. డోలీలో మోసుకుపోతున్న సమయంలోనే వారు అనుభవించే ప్రసవ వేదన వర్ణనాతీతం. దశాబ్దాలుగా ఆదివాసీలు, గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. అరకులోని ఏజెన్సీ ప్రాంతం నుంచి డోలీలలో గర్భిణులను మోసుకువెళుతున్న వైనం చూసిన పవన్ ఆవేదన చెందారు.
ఆ పరిస్థితులు పోవాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని పవన్ అక్కడి ఆడబిడ్డలకు మాటిచ్చారు. అందరు రాజకీయ నాయకుల మాదిరిగా మాటిచ్చి మరిచిపోలేదు పవన్. మాట మీద నిలబడి అరకులోయ మండలంలోని రేగ గ్రామానికి పవన్ రోడ్డు వేయించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించిన పవన్ అన్నియ్యకు అరకు లోయలోని ఆడపడుచులు రుణపడి ఉంటామని చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. డోలీల బాధ తప్పించి రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.
పవన్ చొరవతో వేసిన తారు రోడ్డుపై ప్రయాణించి ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని గర్భిణులు, బాలింతలు ఆనందభాష్పాలతో చెబుతున్నారు. అంబులెన్సుకు ఫోన్ చేసినా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చేది కాదని, ఇప్పుడు రోడ్డు పడడంతో తమ కష్టాలు తీరిపోయాయని సదరు మహిళల భర్తలు చెబుతున్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…