Political News

పొలిటిక‌ల్ డిబేట్‌: జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇస్తోందెవ‌రు?

జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తున్నారు. కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. ర‌ప్పా-ర‌ప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసుల‌ను కూడా హెచ్చ‌రిస్తున్నారు. అది పొదిలైనా.. రెంట‌పాళ్లైనా.. తాజాగా బంగారు పాళ్య‌మైనా. జ‌గ‌న్ దూకుడు ఎక్కువ‌గానే ఉంది. జ‌న స‌మీక‌ర‌ణ కూడా అలానే ఉంది. వీటిని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఓ ప‌ట్టాన సాధ్యం కావ‌డంలేదు. అంతా అయిపోయాక‌.. స‌ర్కారు కేసులు పెట్టి మ‌రోరూపంలో బద్నాం అవుతోంది. ఈ క్ర‌మంలో అస‌లు జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఇస్తోందెవ‌రు? అనేది కీల‌క చ‌ర్చ‌.

ప్ర‌స్తుతం యూట్యూబ్ చానెళ్ల‌లోనే కాదు.. ప్ర‌ధాన మీడియాలోనూ ఈ త‌ర‌హా చ‌ర్చ జోరుగా సాగుతోంది. జ‌గన్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎవ‌రు క‌ల్పిస్తున్నారు? అనేదే చ‌ర్చ‌. ఈ విష‌యంలో అన్ని వేళ్లూ.. కూట‌మి ప్ర‌భుత్వంవైపే చూపిస్తున్నాయి. ఒక్క రెంట‌పాళ్ల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే.. పొదిలి, బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌ల‌కు అవ‌కాశం క‌ల్పించింది.. స‌ర్కారేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పొదిలి ప‌ర్య‌ట‌న‌లో మ‌హిళ‌ల‌పైరాళ్లు, చెప్పులు విసిరారు.

బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌లో మామిడి కాయ‌లు రోడ్డుపై పార‌బోసి.. హ‌ల్చ‌ల్ చేశారు. దీనివ‌ల్ల వైసీపీ న‌ష్ట పోయిన దానికంటే.. కూడా స‌ర్కారుపై వ‌చ్చిన విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వారు చెబుతున్న అస‌లు కార‌ణాలు.. స‌ర్కారు ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని అంటున్నారు. రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న పూర్తిగా వైసీపీకి చెందిన కార్య‌క్ర‌మం. త‌మ పార్టీ కార్య‌క‌ర్త ఏడాది కింద‌ట చేసుకున్న ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ వెళ్లారు.

ఇక‌, పొదిలి విష‌యానికి వ‌స్తే.. పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు రాక‌పోవ‌డంతో వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్ర‌స్తావించేందుకు జ‌గ‌న్ వెళ్లారు. చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ వెళ్లాక‌.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశాక‌.. జ‌ర‌గాల్సిన రాద్ధాంతం జ‌రిగిపోయాక‌.. ప్ర‌భుత్వం రియాక్ట్ అయింది. కేంద్రానికి లేఖ‌లు రాసింది. కేబినెట్‌లో చ‌ర్చించింది. ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. అలా కాకుండా.. ముందుగానే ఈ ప‌నులు చేసి ఉంటే.. జ‌గ‌న్‌కు అవ‌కాశం ద‌క్కేది కాద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

తాజాగా బంగారు పాళ్యం ఘ‌ట‌న‌లోనూ.. ఇదే క‌నిపించింది. తోతాపురి మామిడి కాయ‌ల‌కు క‌నీసం ధ‌ర కూడా దక్క‌డం లేద‌ని రైతులు రెండు మాసాలుగా ఉద్య‌మించారు. రోడ్ల వెంబ‌డి కిలో మీట‌ర్ల లెక్క‌న ట్రాక్ట‌ర్లు నిలిచిపోయాయి. కిలో రూ.2, 1 కే కొంటున్నార‌ని గ‌గ్గోలు పెట్టారు. అప్ప‌ట్లో స‌ర్కారు పెద్ద‌గా ప‌ట్టించుకోలే దు. కానీ.. జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న ప్ర‌క‌టించాక‌.. మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లారు. మామిడి రైతుల‌ను ఆదుకోవాల‌న్నారు.

ఇక‌, జ‌గ‌న్ ప‌ర్య‌టించిన రోజే.. కేబినెట్ 260 కోట్ల రూపాయ‌ల‌ను తోతాపురి రైతుల‌కు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఇవేవో.. ముందుగానే నిర్ణ‌యించి ఉంటే.. అస‌లు జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం కూడా లేదన్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. అంటే.. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్‌కు ఎవ‌రు అవ‌కాశం ఇస్తున్నార‌న్న‌ది ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on July 11, 2025 10:31 am

Share

Recent Posts

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

21 minutes ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

32 minutes ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

48 minutes ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

4 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

4 hours ago

కవితకు… షర్మిలకు.. పోలికా?

కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…

5 hours ago