Political News

ట్రంప్ నే తేజస్వి స్పూర్తిగా తీసుకున్నాడా ?

బీహార్లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తృటిలో మిస్సయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి సాధించిన ఓట్లకు మహాగఠబంధన్ (ఎంజీబీ)కు పోలైన ఓట్లకు మధ్య తేడా కేవలం 12500 మాత్రమే. ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోవటాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వి తట్టుకోలేకపోతున్నట్లుంది. అందుకనే ఎన్డీయే కూటమి విజయంపై కోర్టులో కేసులు వేస్తానంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు తేజస్వీ తీవ్రంగా మండిపోతున్నారు.

పనిలో పనిగా పోలింగ్ అధికారుల వల్ల కూడా తమకు నష్టం జరిగినట్లు ఆరోపణలు మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టకుండా కోర్టులో కేసు వేస్తానని చెప్పటం చూస్తుంటే అచ్చం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన విషయాలే గుర్తుకొస్తున్నాయి. హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే బైడెన్ గెలిచినట్లు స్పష్టమైపోయిందో అప్పటి నుండి ట్రంప్ కూడా నానా రచ్చ మొదలుపెట్టారు.

బైడెన్ గెలుపుపై కోర్టుల్లో ట్రంప్ కేసులు వేయించారు. అక్కడ కూడా పోస్టల్ ఓట్లు వేయటంలోను, లెక్కింపులోను అవకతవకలు జరిగినట్లు కేసులు వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఇల్లీగల్ గా గెలిచారని తాను మాత్రం లీగల్ గానే గెలిచానంటూ పిచ్చి మాటలు మొదలుపెట్టారు. బైడెన్ కు పోలైన ఓట్లను తాను గుర్తించబోనంటు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ బాగా డిస్ట్రబ్ అయినట్లు కనబడుతోంది. అందుకనే అధ్యక్ష పీఠం నుండి దిగేది లేదని, వైట్ హౌస్ నుండి బయటకు వెళ్ళేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

అమెరికాలో ట్రంప్ ఏమి చేస్తున్నారో దాదాపు ఇక్కడ తేజస్వి కూడా అదే చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తానని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, బీహార్ ఎన్నికల్లో తానే గెలిచానని చేస్తున్న ప్రకటనలన్నీ ట్రంపు ప్రకటనలనే గుర్తు చేస్తున్నాయి. కాకపోతే ట్రంప్ అధికారంలో ఉండి బైడెన్ చేతిలో ఓడిపోయారు. బీహార్లో తేజస్వి ప్రతిపక్షంలో ఉండి పోటీచేశారంతే తేడా. మొత్తానికి ఆరోపణలు చేయటంలోను, ఎన్నికల ప్రక్రియపై గోల చేయటంలో ట్రంప్ నుండి తేజస్వీ బాగానే స్పూర్తి పొందినట్లు కనబడుతోంది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago