Political News

జ‌గ‌న్.. మాజీ ముఖ్య‌మంత్రి అంతే ..!

భద్రత- అభద్రతల మధ్య వైసీపీ అధినేత జగన్ ఊగిసలాడుతున్నారా? తను ప్రజల్లోకి వస్తే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రస్తుతం జగన్ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అయితే, ఆయనకు కల్పించే భద్రత విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కంటే మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది. వాస్త‌వానికి మాజీ ముఖ్యమంత్రి కి ఉండే భద్రతకు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉండే భద్రతకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోయినా ప్రజల్లోకి వచ్చినప్పుడు తేడా కనిపిస్తుంది.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గ‌తంలో ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. ఆయనకు కల్పించే భద్రత వేరుగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కి మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కల్పించే భద్రత కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అప్పటికి ఉన్న పరిస్థితులను అంచనా వేయకుండా.. గతంలో ఉన్న పరిస్థితులను మాత్రమే అంచనా వేసుకుని మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించినా.. బ్లాక్ క్యాట్ కమాండోలా భద్రత కల్పించినా గతంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ రకంగా చూసినప్పుడు జగన్‌కు గతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలకు హాని కలిగించే ఘటనలు ఏవి జరగలేదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి కల్పించే భద్రతనే ప్రస్తుతం కల్పిస్తున్నారు. అయితే తన పర్యటనలో ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, రోప్ వే ఏర్పాటు చేయాలనేది జగన్ చెబుతున్న మాట. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతకు రోప్ వేకు సంబంధం లేదనేది ప్రభుత్వ వాదన. రోప్ వే అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కల్పిస్తారు లేదా అధికారంలో ఉన్న నాయకులు వెళ్లినప్పుడు వారికి ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే ఈ త‌ర‌హా భద్రత ఉంటుంది.

ఇప్పుడు ఇదే భద్రతను జగన్ ఆశిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటం లేదు. ప్రస్తుతం ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఓదార్పు యాత్రలు చేసినప్పుడు ఆయన అడగకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రోప్ వే ను ఇచ్చింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఆయన అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హోదాను జగన్ కోల్పోయిన నేపథ్యంలో రోప్ వే ఇవ్వడం లేదనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన.

జడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను గమనిస్తే చుట్టూ నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు భద్రత కల్పించాలి. ఎవరైనా కలుసుకునేందుకు వస్తే వారి వివరాలు తీసుకుని వారిని పంపించాలి. గన్మెన్లు నిరంతరం రక్షణ కల్పించాలి. ఇంతకుమించి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నంత మాత్రాన జనంలోకి వస్తే రోప్ వే ఏర్పాటు చేయాలని గాని వందల మందితో భద్రత కల్పించాలని కానీ ఈ నియమ నిబంధనల‌లో ఎక్కడా లేదనేది పోలీసు వర్గాలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే భద్రత అభద్రతల మధ్య జగన్ ఊగిసలాడుతున్నారనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ మాజీ ముఖ్య‌మంత్రి మాత్రమేన‌ని మంత్రి అనిత చెప్పిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

This post was last modified on July 5, 2025 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…

3 minutes ago

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

50 minutes ago

ఇంట్లో బంగారం… తీరులో భయంకరం

వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…

1 hour ago

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…

2 hours ago

కేసీఆర్‌కు భారీ ప్రాధాన్యం… రేవంత్ రెడ్డి వ్యూహ‌మేంటి?

ఏ రాష్ట్రంలో అయినా... ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌వు. స‌హ‌జంగా రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగిస్తాయి. ఏపీ స‌హా…

2 hours ago

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు…

3 hours ago