Political News

జ‌గ‌న్.. మాజీ ముఖ్య‌మంత్రి అంతే ..!

భద్రత- అభద్రతల మధ్య వైసీపీ అధినేత జగన్ ఊగిసలాడుతున్నారా? తను ప్రజల్లోకి వస్తే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రస్తుతం జగన్ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అయితే, ఆయనకు కల్పించే భద్రత విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కంటే మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది. వాస్త‌వానికి మాజీ ముఖ్యమంత్రి కి ఉండే భద్రతకు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉండే భద్రతకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోయినా ప్రజల్లోకి వచ్చినప్పుడు తేడా కనిపిస్తుంది.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గ‌తంలో ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. ఆయనకు కల్పించే భద్రత వేరుగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కి మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కల్పించే భద్రత కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అప్పటికి ఉన్న పరిస్థితులను అంచనా వేయకుండా.. గతంలో ఉన్న పరిస్థితులను మాత్రమే అంచనా వేసుకుని మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించినా.. బ్లాక్ క్యాట్ కమాండోలా భద్రత కల్పించినా గతంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ రకంగా చూసినప్పుడు జగన్‌కు గతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలకు హాని కలిగించే ఘటనలు ఏవి జరగలేదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి కల్పించే భద్రతనే ప్రస్తుతం కల్పిస్తున్నారు. అయితే తన పర్యటనలో ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, రోప్ వే ఏర్పాటు చేయాలనేది జగన్ చెబుతున్న మాట. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతకు రోప్ వేకు సంబంధం లేదనేది ప్రభుత్వ వాదన. రోప్ వే అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కల్పిస్తారు లేదా అధికారంలో ఉన్న నాయకులు వెళ్లినప్పుడు వారికి ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే ఈ త‌ర‌హా భద్రత ఉంటుంది.

ఇప్పుడు ఇదే భద్రతను జగన్ ఆశిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటం లేదు. ప్రస్తుతం ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఓదార్పు యాత్రలు చేసినప్పుడు ఆయన అడగకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రోప్ వే ను ఇచ్చింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఆయన అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హోదాను జగన్ కోల్పోయిన నేపథ్యంలో రోప్ వే ఇవ్వడం లేదనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన.

జడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను గమనిస్తే చుట్టూ నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు భద్రత కల్పించాలి. ఎవరైనా కలుసుకునేందుకు వస్తే వారి వివరాలు తీసుకుని వారిని పంపించాలి. గన్మెన్లు నిరంతరం రక్షణ కల్పించాలి. ఇంతకుమించి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నంత మాత్రాన జనంలోకి వస్తే రోప్ వే ఏర్పాటు చేయాలని గాని వందల మందితో భద్రత కల్పించాలని కానీ ఈ నియమ నిబంధనల‌లో ఎక్కడా లేదనేది పోలీసు వర్గాలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే భద్రత అభద్రతల మధ్య జగన్ ఊగిసలాడుతున్నారనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ మాజీ ముఖ్య‌మంత్రి మాత్రమేన‌ని మంత్రి అనిత చెప్పిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Satya

Recent Posts

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

56 minutes ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

2 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

4 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

4 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

7 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

7 hours ago