Political News

కేంద్రాన్ని వాడుకోవ‌డంలో బాబు వెనుక‌బ‌డ్డారా?

ఔను.. ఈ మాట సీనియ‌ర్ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి.. విశ్లేష‌కుల వ‌ర‌కు కూడా వినిపిస్తోంది. కూట‌మిలో ప్రధాన భాగ‌స్వామ్య ప‌క్షంగా టీడీపీ ఉంది. ప్ర‌స్తుతం కేంద్రంలో మోడీ అధికారంలో ఉండ‌డానికి కీల‌క‌మై న రెండు ప్ర‌ధాన పార్టీల్లో టీడీపీ మ‌రీ ముఖ్యం. బిహార్ అధికార పార్టీ జేడీయూ.. కంటే కూడా.. న‌లుగురు ఎంపీలు టీడీపీకే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా.. జేడీయూ అధినేత‌, సీఎం నితీష్ కుమార్ మాదిరిగా చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన ఎలా మారుతారో.. అన్న బెంగ కూడా లేదు.

దీంతో కేంద్రంలో చంద్ర‌బాబు అంటే.. అత్యంత న‌మ్మ‌కస్తుడైన మిత్ర‌ప‌క్షంగా ఉన్నారు. మ‌రి.. ఇంత బ‌ల‌మైన ముద్ర వేసుకున్న చంద్ర‌బాబు కూట‌మి త‌ర‌ఫున అనేక ప‌నులు చేయించుకునే వెసులు బాటు ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో వెనుక‌బ‌డ్డార‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో కేంద్రం నుంచి ప్ర‌తిపాద‌న‌లు వెన‌క్కి రావ‌డం చ‌ర్చ‌గా మారింది. స‌రే.. దీనికి సంబంధించి కేంద్రానికి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

మరో ముఖ్య‌మైన రెండు విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. 1) పొగాకు, 2) మామిడి. ఈ రెండు విష‌యాల్లోనూ.. కూడా చంద్ర‌బాబు కేంద్రం నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తును.. ఏపీకి ప్ర‌యోజ‌నాలు కూడ‌గ‌ట్ట‌లేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ రెండు అంశాల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ.. క‌నీసం రోజుల వ్య‌వ‌ధిలో అయినా.. కేంద్రం నుంచి సానుకూల ప‌రిణామాల‌ను రాబ‌ట్ట‌లేక పోయారన్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇలా.. చంద్ర‌బాబు వైపు వేలెత్తి చూప‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం ఉంది.

అదే.. ఈ రెండు విష‌యాల్లో క‌ర్ణాట‌క మాజీ సీఎం, జేడీఎస్‌ నాయ‌కుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కుమార స్వామి రాత్రికి రాత్రి సాధించ‌డ‌మే. జేడీఎస్ కూడా కేంద్రంలో భాగ‌స్వామి. కానీ, ఈ పార్టీకి కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. అయితే.. కుమార‌స్వామి సాధించారన్న‌ది విశ్లేష‌కులు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. క‌ర్ణాట‌క‌లో కూడా సేమ్ టు సేమ్‌.. పొగాకు, మామిడి కాయ‌ల స‌మ‌స్య ఉంది.

దీనిని ప్ర‌స్తావిస్తూ.. కుమార‌స్వామి లేఖ రాయ‌డంతో.. ఆ వెంట‌నే మామిడి కాయ‌ల‌ను కిలోకు రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేసింది. పొగాకును కూడా అంతే యుద్ధ‌ప్రాతిప‌దికన కొనే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. కానీ.. ఏపీలో ఆ త‌ర‌హా దూకుడు లేదు. ఇద్ద‌రు కేంద్ర మంత్రులు.. 21 మంది ఎంపీలు ఉన్నా.. ఎందుకో .. చంద్ర‌బాబు మంచిత‌నంతో.. చాలా స‌హృద‌యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇది కేంద్రానికి మేలు చేస్తుంది కానీ.. స్థానికంగా టీడీపీకి ఇబ్బందులు తెస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 5, 2025 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

32 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

51 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago