Political News

కేంద్రాన్ని వాడుకోవ‌డంలో బాబు వెనుక‌బ‌డ్డారా?

ఔను.. ఈ మాట సీనియ‌ర్ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి.. విశ్లేష‌కుల వ‌ర‌కు కూడా వినిపిస్తోంది. కూట‌మిలో ప్రధాన భాగ‌స్వామ్య ప‌క్షంగా టీడీపీ ఉంది. ప్ర‌స్తుతం కేంద్రంలో మోడీ అధికారంలో ఉండ‌డానికి కీల‌క‌మై న రెండు ప్ర‌ధాన పార్టీల్లో టీడీపీ మ‌రీ ముఖ్యం. బిహార్ అధికార పార్టీ జేడీయూ.. కంటే కూడా.. న‌లుగురు ఎంపీలు టీడీపీకే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా.. జేడీయూ అధినేత‌, సీఎం నితీష్ కుమార్ మాదిరిగా చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన ఎలా మారుతారో.. అన్న బెంగ కూడా లేదు.

దీంతో కేంద్రంలో చంద్ర‌బాబు అంటే.. అత్యంత న‌మ్మ‌కస్తుడైన మిత్ర‌ప‌క్షంగా ఉన్నారు. మ‌రి.. ఇంత బ‌ల‌మైన ముద్ర వేసుకున్న చంద్ర‌బాబు కూట‌మి త‌ర‌ఫున అనేక ప‌నులు చేయించుకునే వెసులు బాటు ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో వెనుక‌బ‌డ్డార‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో కేంద్రం నుంచి ప్ర‌తిపాద‌న‌లు వెన‌క్కి రావ‌డం చ‌ర్చ‌గా మారింది. స‌రే.. దీనికి సంబంధించి కేంద్రానికి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

మరో ముఖ్య‌మైన రెండు విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. 1) పొగాకు, 2) మామిడి. ఈ రెండు విష‌యాల్లోనూ.. కూడా చంద్ర‌బాబు కేంద్రం నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తును.. ఏపీకి ప్ర‌యోజ‌నాలు కూడ‌గ‌ట్ట‌లేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ రెండు అంశాల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ.. క‌నీసం రోజుల వ్య‌వ‌ధిలో అయినా.. కేంద్రం నుంచి సానుకూల ప‌రిణామాల‌ను రాబ‌ట్ట‌లేక పోయారన్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇలా.. చంద్ర‌బాబు వైపు వేలెత్తి చూప‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం ఉంది.

అదే.. ఈ రెండు విష‌యాల్లో క‌ర్ణాట‌క మాజీ సీఎం, జేడీఎస్‌ నాయ‌కుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కుమార స్వామి రాత్రికి రాత్రి సాధించ‌డ‌మే. జేడీఎస్ కూడా కేంద్రంలో భాగ‌స్వామి. కానీ, ఈ పార్టీకి కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. అయితే.. కుమార‌స్వామి సాధించారన్న‌ది విశ్లేష‌కులు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. క‌ర్ణాట‌క‌లో కూడా సేమ్ టు సేమ్‌.. పొగాకు, మామిడి కాయ‌ల స‌మ‌స్య ఉంది.

దీనిని ప్ర‌స్తావిస్తూ.. కుమార‌స్వామి లేఖ రాయ‌డంతో.. ఆ వెంట‌నే మామిడి కాయ‌ల‌ను కిలోకు రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేసింది. పొగాకును కూడా అంతే యుద్ధ‌ప్రాతిప‌దికన కొనే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. కానీ.. ఏపీలో ఆ త‌ర‌హా దూకుడు లేదు. ఇద్ద‌రు కేంద్ర మంత్రులు.. 21 మంది ఎంపీలు ఉన్నా.. ఎందుకో .. చంద్ర‌బాబు మంచిత‌నంతో.. చాలా స‌హృద‌యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇది కేంద్రానికి మేలు చేస్తుంది కానీ.. స్థానికంగా టీడీపీకి ఇబ్బందులు తెస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 5, 2025 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

2 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

4 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

4 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

5 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

5 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

6 hours ago