Political News

సుగుణ‌మ్మ రాజ‌కీయాలు ముగిసిన‌ట్టేనా? బాబు వ్యూహం ఏంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో కీల‌క‌మైన తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క మార్పుల దిశ‌గా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ఇక్క‌డ నుంచి పార్టీలో కీల‌కంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌కు చెక్ పెట్టేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు సుగుణ‌మ్మ మ‌ద్ద‌తు దారులు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేవ‌లం 4 సార్లు మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. పార్టీ పెట్టిన సంవ‌త్స‌రంలో ఇక్క‌డ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసివిజ‌యం సాధించారు.

ఆత‌ర్వాత 1994, 1999లో వ‌రుస విజ‌యాల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ హ‌వా ప్రారంభ మైంది. దీంతో పార్టీ వ‌రుస ఓట‌ములతో కుదేలైంది. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఎం. వెంక‌ట‌ర‌మ‌ణ ఎంతో కృషి చేశారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న వెంక‌ట ర‌మ‌ణ‌.. భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి రాక‌తో.. అలిగి.. పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి.. వెంక‌ట‌ర‌మ‌ణకు అనుకూలంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014లో విజ‌యం సాదించారు. అయితే, ఈ విజ‌యాన్ని ఆస్వాదించేలోగా.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప పోరులో వెంక‌ట‌ర‌మ‌ణ స‌తీమ‌ణి సుగుణ‌మ్మ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో 2015లో జ‌రిగిన ఉప పోరులో సుగుణ‌మ్మ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. టీటీడీ బోర్డు స‌భ్యురాలుగా కూడా చంద్ర‌బాబు ఆమెకు అవ‌కాశం ఇచ్చారు. అయితే, సుగుణ‌మ్మ త‌న భ‌ర్త మాదిరిగా దూకుడు ప్ర‌ద‌ర్శించలేక పోవ‌డం, అందరినీ కలుపుకొని పోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాలు వైసీపీకి క‌లిసి వ‌చ్చాయి. దీంతో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేశారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని అనుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు.. ఇప్పుడు సుగుణ‌మ్మ‌ను ప‌క్క‌న పెట్టారు. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల విష‌యంలో మాజీ ఎమ్మెల్యేగా సుగుణ‌మ్మ కొంద‌రి పేర్ల‌ను సిఫార‌సు చేశారు. అయితే, చంద్ర‌బాబు వారికి ప‌దవులు ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యంలోకి కూడా తీసుకోలేదు. పైగా వీరి వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్‌రెడ్డికి పదవులుఇచ్చారు. ఈ ప‌రిణామంపై సుగుణ‌మ్మ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీకి తాము ఇక దూరం కావాల్సిందే..! అనే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు వ్యూహం బాగానే ఉన్నా.. ఆయ‌న ఎంచుకున్న వారైనా.. పార్టీని బ‌లోపేతం చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on November 16, 2020 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

7 minutes ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

20 minutes ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

1 hour ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

2 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

2 hours ago

కన్నడ హీరోయిన్ ప్రశ్న… జవాబు చెప్పగలమా?

దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…

2 hours ago