టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక మార్పుల దిశగా చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంటున్నారు సుగుణమ్మ మద్దతు దారులు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. పార్టీ పెట్టిన సంవత్సరంలో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసివిజయం సాధించారు.
ఆతర్వాత 1994, 1999లో వరుస విజయాలను టీడీపీ దక్కించుకుంది. ఇక, ఆ తర్వాత వైఎస్ హవా ప్రారంభ మైంది. దీంతో పార్టీ వరుస ఓటములతో కుదేలైంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎం. వెంకటరమణ ఎంతో కృషి చేశారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న వెంకట రమణ.. భూమన కరుణాకర్రెడ్డి రాకతో.. అలిగి.. పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి.. వెంకటరమణకు అనుకూలంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన 2014లో విజయం సాదించారు. అయితే, ఈ విజయాన్ని ఆస్వాదించేలోగా.. హఠాన్మరణం చెందారు. దీంతో ఇక్కడ జరిగిన ఉప పోరులో వెంకటరమణ సతీమణి సుగుణమ్మకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
ఈ క్రమంలో 2015లో జరిగిన ఉప పోరులో సుగుణమ్మ ఏకపక్షంగా విజయం దక్కించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలుగా కూడా చంద్రబాబు ఆమెకు అవకాశం ఇచ్చారు. అయితే, సుగుణమ్మ తన భర్త మాదిరిగా దూకుడు ప్రదర్శించలేక పోవడం, అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమయ్యారు. ఈ పరిణామాలు వైసీపీకి కలిసి వచ్చాయి. దీంతో భూమన కరుణాకర్రెడ్డి గత ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేశారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని బలోపేతం చేసుకోవాలని అనుకున్నారో.. ఏమో.. చంద్రబాబు.. ఇప్పుడు సుగుణమ్మను పక్కన పెట్టారు. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పార్టీ పదవుల విషయంలో మాజీ ఎమ్మెల్యేగా సుగుణమ్మ కొందరి పేర్లను సిఫారసు చేశారు. అయితే, చంద్రబాబు వారికి పదవులు ఇవ్వకపోగా.. కనీసం ప్రాధాన్యంలోకి కూడా తీసుకోలేదు. పైగా వీరి వ్యతిరేక వర్గంగా ఉన్న జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్రెడ్డికి పదవులుఇచ్చారు. ఈ పరిణామంపై సుగుణమ్మ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి తాము ఇక దూరం కావాల్సిందే..! అనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు వ్యూహం బాగానే ఉన్నా.. ఆయన ఎంచుకున్న వారైనా.. పార్టీని బలోపేతం చేస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on November 16, 2020 8:43 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…