Political News

సుగుణ‌మ్మ రాజ‌కీయాలు ముగిసిన‌ట్టేనా? బాబు వ్యూహం ఏంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో కీల‌క‌మైన తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క మార్పుల దిశ‌గా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ఇక్క‌డ నుంచి పార్టీలో కీల‌కంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌కు చెక్ పెట్టేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు సుగుణ‌మ్మ మ‌ద్ద‌తు దారులు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేవ‌లం 4 సార్లు మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. పార్టీ పెట్టిన సంవ‌త్స‌రంలో ఇక్క‌డ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసివిజ‌యం సాధించారు.

ఆత‌ర్వాత 1994, 1999లో వ‌రుస విజ‌యాల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ హ‌వా ప్రారంభ మైంది. దీంతో పార్టీ వ‌రుస ఓట‌ములతో కుదేలైంది. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఎం. వెంక‌ట‌ర‌మ‌ణ ఎంతో కృషి చేశారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న వెంక‌ట ర‌మ‌ణ‌.. భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి రాక‌తో.. అలిగి.. పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి.. వెంక‌ట‌ర‌మ‌ణకు అనుకూలంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014లో విజ‌యం సాదించారు. అయితే, ఈ విజ‌యాన్ని ఆస్వాదించేలోగా.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప పోరులో వెంక‌ట‌ర‌మ‌ణ స‌తీమ‌ణి సుగుణ‌మ్మ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో 2015లో జ‌రిగిన ఉప పోరులో సుగుణ‌మ్మ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. టీటీడీ బోర్డు స‌భ్యురాలుగా కూడా చంద్ర‌బాబు ఆమెకు అవ‌కాశం ఇచ్చారు. అయితే, సుగుణ‌మ్మ త‌న భ‌ర్త మాదిరిగా దూకుడు ప్ర‌ద‌ర్శించలేక పోవ‌డం, అందరినీ కలుపుకొని పోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాలు వైసీపీకి క‌లిసి వ‌చ్చాయి. దీంతో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేశారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని అనుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు.. ఇప్పుడు సుగుణ‌మ్మ‌ను ప‌క్క‌న పెట్టారు. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల విష‌యంలో మాజీ ఎమ్మెల్యేగా సుగుణ‌మ్మ కొంద‌రి పేర్ల‌ను సిఫార‌సు చేశారు. అయితే, చంద్ర‌బాబు వారికి ప‌దవులు ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యంలోకి కూడా తీసుకోలేదు. పైగా వీరి వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్‌రెడ్డికి పదవులుఇచ్చారు. ఈ ప‌రిణామంపై సుగుణ‌మ్మ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీకి తాము ఇక దూరం కావాల్సిందే..! అనే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు వ్యూహం బాగానే ఉన్నా.. ఆయ‌న ఎంచుకున్న వారైనా.. పార్టీని బ‌లోపేతం చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on November 16, 2020 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

24 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago