గత 15 రోజులకుపైగా మీడియాలో హాట్ టాపిక్గా మారిన .. సింగయ్య మృతి కేసు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న వాదన వీగిపోతుందా? అంటే.. ఔననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా సింగయ్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వచ్చారు. తన భర్త కారు కింద పడడం వల్ల మృతి చెందలేదన్నారు. ఆయన మరణంపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. కావాలనే ఎవరో చంపేసి ఉంటారని.. ఆసుపత్రికి వెళ్లే వరకు కూడా.. సింగయ్య ఒంటిపై పెద్దగా గాయాలు కూడా లేవన్నారు.
ఈ కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో లూర్దు మేరి.. అటు పోలీసుల పైనా.. ఇటు టీడీపీ నాయకులపైనా సందేహాలు వ్యక్తం చేశారు. పోలీసులు తమ పై ఒత్తిడి తెచ్చి.. కేసు పెట్టించారని అన్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా తమ ఇంటికి పదే పదే వచ్చి.. తమను చెప్పినట్టు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో తాము చాలా వరకు ఇబ్బంది పడ్డామన్నారు. అందుకే.. ఈ కేసుపై మాట్లాడేందుకు తాము బయటకు రాలేకపోయామని చెప్పారు.
“సింగయ్య మృతి పై అనుమానాలున్నాయి. కారు కింద పడితే చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడు. పోలీసులు మమ్మల్ని ఆరోజు ఆటోలోకి కూడా ఎక్కడానికి అనుమతించలేదు. సింగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది.” అని లూర్దు మేరీ అన్నారు. “లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు.. వాళ్లు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారు.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగింది?
గత నెల జూన్ 18న జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సమ యంలో ఆయన కాన్వాయ్ కిందప డి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెప్పారు. దీనిపై అనేక రాజకీయాలు.. జరిగాయి. మరోవైపు కోర్టులలోనూ ఈ కేసు విచారణకు వచ్చింది.జగన్ను ఏ2గా పేర్కొంటూ.. కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసు విచారణపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. ఈ నేపథ్యంలో సింగయ్య భార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
This post was last modified on July 2, 2025 4:56 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…