Political News

సింగయ్య చుట్టూ రాజకీయాలు..

గత 15 రోజుల‌కుపైగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన .. సింగయ్య మృతి కేసు యూట‌ర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాద‌న వీగిపోతుందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. తాజాగా సింగ‌య్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న భ‌ర్త కారు కింద ప‌డ‌డం వ‌ల్ల మృతి చెంద‌లేద‌న్నారు. ఆయ‌న మ‌ర‌ణంపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని తెలిపారు. కావాల‌నే ఎవ‌రో చంపేసి ఉంటార‌ని.. ఆసుప‌త్రికి వెళ్లే వ‌ర‌కు కూడా.. సింగ‌య్య ఒంటిపై పెద్ద‌గా గాయాలు కూడా లేవ‌న్నారు.

ఈ కేసును మ‌ళ్లీ విచారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో లూర్దు మేరి.. అటు పోలీసుల పైనా.. ఇటు టీడీపీ నాయ‌కుల‌పైనా సందేహాలు వ్య‌క్తం చేశారు. పోలీసులు త‌మ‌ పై ఒత్తిడి తెచ్చి.. కేసు పెట్టించార‌ని అన్నారు. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా తమ ఇంటికి ప‌దే ప‌దే వ‌చ్చి.. త‌మ‌ను చెప్పిన‌ట్టు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వివ‌రించారు. దీంతో తాము చాలా వ‌ర‌కు ఇబ్బంది ప‌డ్డామ‌న్నారు. అందుకే.. ఈ కేసుపై మాట్లాడేందుకు తాము బ‌య‌ట‌కు రాలేక‌పోయామ‌ని చెప్పారు.

“సింగయ్య మృతి పై అనుమానాలున్నాయి. కారు కింద ప‌డితే చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడు. పోలీసులు మ‌మ్మ‌ల్ని ఆరోజు ఆటోలోకి కూడా ఎక్కడానికి అనుమతించ‌లేదు. సింగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించిన తర్వాత ఏదో జ‌రిగింది.” అని లూర్దు మేరీ అన్నారు. “లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు.. వాళ్లు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అస‌లేం జ‌రిగింది?

గ‌త నెల జూన్ 18న జ‌గ‌న్ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ యంలో ఆయ‌న కాన్వాయ్ కింద‌ప డి సింగ‌య్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన‌ట్టు పోలీసులు చెప్పారు. దీనిపై అనేక రాజ‌కీయాలు.. జ‌రిగాయి. మ‌రోవైపు కోర్టుల‌లోనూ ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది.జ‌గ‌న్‌ను ఏ2గా పేర్కొంటూ.. కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసు విచార‌ణ‌పై హైకోర్టు తాజాగా స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో సింగ‌య్య భార్య వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

This post was last modified on July 2, 2025 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago