Political News

సింగయ్య చుట్టూ రాజకీయాలు..

గత 15 రోజుల‌కుపైగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన .. సింగయ్య మృతి కేసు యూట‌ర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాద‌న వీగిపోతుందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. తాజాగా సింగ‌య్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న భ‌ర్త కారు కింద ప‌డ‌డం వ‌ల్ల మృతి చెంద‌లేద‌న్నారు. ఆయ‌న మ‌ర‌ణంపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని తెలిపారు. కావాల‌నే ఎవ‌రో చంపేసి ఉంటార‌ని.. ఆసుప‌త్రికి వెళ్లే వ‌ర‌కు కూడా.. సింగ‌య్య ఒంటిపై పెద్ద‌గా గాయాలు కూడా లేవ‌న్నారు.

ఈ కేసును మ‌ళ్లీ విచారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో లూర్దు మేరి.. అటు పోలీసుల పైనా.. ఇటు టీడీపీ నాయ‌కుల‌పైనా సందేహాలు వ్య‌క్తం చేశారు. పోలీసులు త‌మ‌ పై ఒత్తిడి తెచ్చి.. కేసు పెట్టించార‌ని అన్నారు. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా తమ ఇంటికి ప‌దే ప‌దే వ‌చ్చి.. త‌మ‌ను చెప్పిన‌ట్టు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వివ‌రించారు. దీంతో తాము చాలా వ‌ర‌కు ఇబ్బంది ప‌డ్డామ‌న్నారు. అందుకే.. ఈ కేసుపై మాట్లాడేందుకు తాము బ‌య‌ట‌కు రాలేక‌పోయామ‌ని చెప్పారు.

“సింగయ్య మృతి పై అనుమానాలున్నాయి. కారు కింద ప‌డితే చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడు. పోలీసులు మ‌మ్మ‌ల్ని ఆరోజు ఆటోలోకి కూడా ఎక్కడానికి అనుమతించ‌లేదు. సింగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించిన తర్వాత ఏదో జ‌రిగింది.” అని లూర్దు మేరీ అన్నారు. “లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు.. వాళ్లు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అస‌లేం జ‌రిగింది?

గ‌త నెల జూన్ 18న జ‌గ‌న్ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ యంలో ఆయ‌న కాన్వాయ్ కింద‌ప డి సింగ‌య్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన‌ట్టు పోలీసులు చెప్పారు. దీనిపై అనేక రాజ‌కీయాలు.. జ‌రిగాయి. మ‌రోవైపు కోర్టుల‌లోనూ ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది.జ‌గ‌న్‌ను ఏ2గా పేర్కొంటూ.. కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసు విచార‌ణ‌పై హైకోర్టు తాజాగా స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో సింగ‌య్య భార్య వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Satya

Recent Posts

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

14 minutes ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

44 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago

నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…

4 hours ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

5 hours ago