Political News

48 గంటల తర్వాత… ప్రమాదం పై సిగాచీ ప్రకటన

ఘోర ప్రమాదం జరిగి కార్మికులు చెల్లాచెదురు అయిపోతే… ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రమాద స్థలిని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించి, ఆ మేరకు కొంతమేర సాయం అందించాక గాని అసలు కంపెనీ యాజమాన్యం స్పందించక పోవడం నిజంగానే ఎక్కడ కూడా చూసి ఉండం. తన కంపెనీలో ప్రమాదం జరిగితే… అందరికంటే ముందు ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తుంది. తన కార్మికులకు అండగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కంపెనీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ప్రమాదం జరిగి 48 గటలు గడిచిన తర్వాత గానీ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు.

సోమవారం ఉదయం సిగాచీలో ప్రమాదం జరిగితే… బుధవారం ఉదయం సిగాచీ కంపెనీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అది కూడా ఏదో తన కార్మికుల సంక్షేమమో, లేదంటే చనిపోయిన తన కార్మికుల పట్ల బాధతోనే సిగాచీ ఈ ప్రకటన చేయలేదు. స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇవ్వడం కోసమే సిగాచీ ఈ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్సేంజీకి పంపిన వివరణనే సిగాచీ సెక్రటరీ వివేక్ కుమార్ బహిరంగ ప్రకటనగా మార్చి విడుదల చేశారు.

సిగాచీ ప్రకటన మేరకు… కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటిదాకా 40 మంది చనిపోయారని, 33 మందికి గాయాలు కాగా వారంతా హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తామే అందిస్తామని, అనంతరం వారికి అవసరమయ్యే వివిధ రకాల ఏర్పాట్లను కూడా కంపెనీనే సమకూర్చుతుందని తెలిపింది.

ఈ ప్రకటన కూడా కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పేరు మీద రాగా.. కంపెనీ ఓనర్ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు ఎవ్వరూ ఇప్పటిదాకా ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాలేదు. వాస్తవానికి సిగాచీలో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఇంకా శిథిలాల తొలగింపు జరుగుతోంది. శిథిలాల కింద మరింత మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల తొలగింపు పూర్తి అయ్యాక గానీ మృతుల సంఖ్య తెలియదని చెప్పాలి.

This post was last modified on July 2, 2025 4:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

1 hour ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

2 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

2 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

2 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

4 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

5 hours ago