Political News

48 గంటల తర్వాత… ప్రమాదం పై సిగాచీ ప్రకటన

ఘోర ప్రమాదం జరిగి కార్మికులు చెల్లాచెదురు అయిపోతే… ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రమాద స్థలిని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించి, ఆ మేరకు కొంతమేర సాయం అందించాక గాని అసలు కంపెనీ యాజమాన్యం స్పందించక పోవడం నిజంగానే ఎక్కడ కూడా చూసి ఉండం. తన కంపెనీలో ప్రమాదం జరిగితే… అందరికంటే ముందు ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తుంది. తన కార్మికులకు అండగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కంపెనీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ప్రమాదం జరిగి 48 గటలు గడిచిన తర్వాత గానీ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు.

సోమవారం ఉదయం సిగాచీలో ప్రమాదం జరిగితే… బుధవారం ఉదయం సిగాచీ కంపెనీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అది కూడా ఏదో తన కార్మికుల సంక్షేమమో, లేదంటే చనిపోయిన తన కార్మికుల పట్ల బాధతోనే సిగాచీ ఈ ప్రకటన చేయలేదు. స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇవ్వడం కోసమే సిగాచీ ఈ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్సేంజీకి పంపిన వివరణనే సిగాచీ సెక్రటరీ వివేక్ కుమార్ బహిరంగ ప్రకటనగా మార్చి విడుదల చేశారు.

సిగాచీ ప్రకటన మేరకు… కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటిదాకా 40 మంది చనిపోయారని, 33 మందికి గాయాలు కాగా వారంతా హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తామే అందిస్తామని, అనంతరం వారికి అవసరమయ్యే వివిధ రకాల ఏర్పాట్లను కూడా కంపెనీనే సమకూర్చుతుందని తెలిపింది.

ఈ ప్రకటన కూడా కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పేరు మీద రాగా.. కంపెనీ ఓనర్ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు ఎవ్వరూ ఇప్పటిదాకా ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాలేదు. వాస్తవానికి సిగాచీలో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఇంకా శిథిలాల తొలగింపు జరుగుతోంది. శిథిలాల కింద మరింత మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల తొలగింపు పూర్తి అయ్యాక గానీ మృతుల సంఖ్య తెలియదని చెప్పాలి.

This post was last modified on July 2, 2025 4:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

54 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago