వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎట్టకేలకు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై నమోదు అయిన అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో దాదాపుగా 4 నెలల 20 రోజుల పాటు సుదీర్ఘ జైలు జీవితం అనంతరం వంశీ బెయిల్ పై విడుదలయ్యారు. బుధవారం 2.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ అప్పటికే అక్కడకు చేరుకున్న తన సతీమణితో కలిసి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు.
దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వంశీని అదుపులోకి తీసుకుని బెజవాడ తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనను బెజవాడ జైలుకు తరలించగా… ఆ తర్వాత వంశీపై అంతకుముందే నమోదు అయిన చాలా కేసులన్నీ ఓపెన్ అయిపోయాయి. కొత్తగా కొన్ని కేసులూ నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ విధింపులతో నాలుగు నెలలకు పైబడి వంశీ జైలులోనే గడపాల్సి వచ్చింది.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంశీ… ఆ తర్వాత టీడీపీని వీడి అధికార వైసీపీ దరి చేరారు. ఆపై జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గన్నవరంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీ… కొడాలి నానితో కలిసి చంద్రబాబు, లోకేశ్ లపై పరుష పదజాలంతో విరుకుచుపడ్డారు. అంతేకాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై కూడా వంశీ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోఫణలు ఉన్నాయి. ఈ కేసును మాఫీ చేసుకునే క్రమంలోనే ఆయన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేయించి అడ్డంగా బుక్కైపోయారు.
This post was last modified on July 2, 2025 4:44 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…