వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎట్టకేలకు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై నమోదు అయిన అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో దాదాపుగా 4 నెలల 20 రోజుల పాటు సుదీర్ఘ జైలు జీవితం అనంతరం వంశీ బెయిల్ పై విడుదలయ్యారు. బుధవారం 2.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ అప్పటికే అక్కడకు చేరుకున్న తన సతీమణితో కలిసి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు.
దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వంశీని అదుపులోకి తీసుకుని బెజవాడ తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనను బెజవాడ జైలుకు తరలించగా… ఆ తర్వాత వంశీపై అంతకుముందే నమోదు అయిన చాలా కేసులన్నీ ఓపెన్ అయిపోయాయి. కొత్తగా కొన్ని కేసులూ నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ విధింపులతో నాలుగు నెలలకు పైబడి వంశీ జైలులోనే గడపాల్సి వచ్చింది.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంశీ… ఆ తర్వాత టీడీపీని వీడి అధికార వైసీపీ దరి చేరారు. ఆపై జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గన్నవరంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీ… కొడాలి నానితో కలిసి చంద్రబాబు, లోకేశ్ లపై పరుష పదజాలంతో విరుకుచుపడ్డారు. అంతేకాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై కూడా వంశీ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోఫణలు ఉన్నాయి. ఈ కేసును మాఫీ చేసుకునే క్రమంలోనే ఆయన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేయించి అడ్డంగా బుక్కైపోయారు.
This post was last modified on July 2, 2025 4:44 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…