తెలుగుదేశంపార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. రాజమండ్రి నుండి ఈయన ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు అన్నగారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మధ్యలో రాజకీయ జీవితం కాస్త కుదుపులకు లోనైనా మళ్ళీ సర్దుకున్నది. తాజాగా మీడియా సమావేశం పెట్టిన బుచ్చయ్య తన రాజకీయ వారసుడిని ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన సోదరుని కొడుకు డాక్టర్ రవిరామ్ ఇక నుండి తన వారసునిగా రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటారని చేసిన ప్రకటనతో బుచ్చయ్య రిటైర్ అయినట్లే అని అందరు అనుకుంటున్నారు. ప్రకటన చేయటమే కాకుండా రవి రామ్ ను మీడియా ముఖంగా పరిచయం కూడా చేశారు. వారసుడిన మీడియా ద్వారా జనాలకు పరిచయటం చేయటంతో బుచ్చయ్య రాజకీయంగా రిటైన్ అయినట్లే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పైగా ఎన్నికల్లో పోటీ చేయించే విషయమై అధినేత నిర్ణయం తీసుకుంటారనే కటింగ్ కూడా ఇఛ్చారు లేండి.
దాదాపు 76 ఏళ్ళున్న బుచ్చయ్య ఇప్పటికి కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. బుచ్చయ్య ఆరోగ్యంపైన, గ్లామర్ పైన అసెంబ్లీలో సమావేశాల్లోనే చర్చలు జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 1994లో ఎన్టీయార్ నేతృత్వంలో ఘన విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వంలో బుచ్చయ్య పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వెన్నుపోటు కారణంగా ఎన్టీయార్ ను చంద్రబాబునాయుడు పదవిలో నుండి దింపేశారు. అప్పుడు బుచ్చయ్య పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ కు మద్దతుగా నిలిచారు.
అయితే 1995లో ఎన్టీయార్ మరణించిన తర్వాత వేరే దారిలేక మళ్ళీ చంద్రబాబు దగ్గరకే వచ్చారు. అప్పటి నుండి ఓడినా, గెలిచినా టీడీపీలోనే కంటిన్యు అవుతున్న బుచ్చయ్యకు చంద్రబాబు మాత్రం మళ్ళీ మంత్రిపదవిని ఇవ్వలేదు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి మాత్రం బుచ్చయ్యలోచా ఉంది. తన కన్నా జూనియర్లకు మంత్రిపదవులు ఇస్తున్న చంద్రబాబు తనను మాత్రం దూరంగా పెడుతున్నట్లు బాహిరంగంగానే మండిపడినపుడు పార్టీలో సంచలనం రేగింది. సరే ఏదేమైనా తాజాగా ఆయన ప్రకటన చూసిన తర్వాత తొందరలోనే తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారనేది అర్ధమైపోయింది.
This post was last modified on November 15, 2020 1:57 pm
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…