ఈ విషయమే తెలుగుదేశంపార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధికారానికి దూరమైనా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ లో గెలిచారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే గంటా తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. టీడీపీకి రాజీనామా చేస్తారని, వైసీపీలో చేరుతారనే ప్రచారం గంటా విషయంలో జరిగినట్లుగా మరే టీడీపీ నేతపైనా జరగలేదంటే అతిశయోక్తి కాదు.
మరి తన వ్యవహారశైలి వల్ల గంటానే అలాంటి ప్రచారం చేయించుకున్నారో లేకపోతే మీడియానే అత్యుత్సాహం చూపించి ఈ మాజీ మంత్రికి ప్రచారం కల్పిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ దశలోనే ముందు గంటా కొడుకు వైసీపీ కండువా కప్పేసుకోబోతున్నట్లు ఒక్కసారిగా మొదలైన ప్రచారం అంతే తొందరగా చల్లారిపోయింది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు పార్టీ పదవులను భర్తీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు.
సంకేతాలు పంపినట్లే ముందుగా జాతీయ కమిటి, పాలిట్ బ్యూరోను నియమించారు. తాజాగా రాష్ట్ర కమిటిని కూడా నియమించారు. అయితే మూడు కమిటిల్లో దేనిలోను గంటా పేరు కనబడలేదు. దీంతో చంద్రబాబే మాజీమంత్రిని దూరం పెట్టారా లేకపోతే గంటానే పార్టీకి దూరంగా ఉన్న కారణంగా ఏ కమిటిలోను చోటు దక్కలేదా ? అన్నదే మిగిలిన నేతలకు అర్ధం కావటం లేదు. ఎందుకంటే తమకు కమిటిల్లో చోటు కల్పించలేదని చాలామంది నేతలు అలిగారు. చంద్రబాబుకు తన నిరసనను లేఖల రూపంలో అందించారు కూడా.
అలిగిన నేతలను, అసంతృప్తితో ఉన్న నేతల్లో కొందరితో చంద్రబాబు నేరుగానో లేకపోతే ఫోన్లోలోనో మాట్లాడారు. అయితే గంటాతో మాత్రం చంద్రబబు మాట్లాడేందుకు కనీసం ప్రయత్నించను కూడా లేదట. ఎందుకంటే తన పేరు ఏ కమిటిలో లేకపోయినా గంటా కూడా పెద్దగా స్పందించలేదట. పార్టీలోని మిగిలిన నేతలతో కూడా పెద్దగా కలవటం లేదని సమాచారం. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటం లేదు. దాంతో పార్టీయే గంటాను వదిలేసిందా ? లేకపోతే గంటాయే పార్టీని వదిలేశారా ? అన్నదే అర్ధం కావటం లేదట.
This post was last modified on November 15, 2020 11:04 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…