ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య సోమవారం నాటికి 11కి చేరింది. ఈ సంఖ్య త్వరలోనే 12కు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ 12 అరెస్టు మరెవరిదో కాదు…చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అటు ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఈ రెండు చోట్లా సోమవారం ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.
అదే సమయంలో లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సోమవారం మరోమారు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా మోహిత్ విచారణకు హాజరు కాలేదు. తాను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నానని, అవి తేలాక విచారణకు వస్తానన్న రీతిలో సాగిన మోహిత్.. రేపు విచారణకు హాజరు కాకపోతే మాత్రం సిట్ రంగంలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ మోహిత్ విచారణకు వచ్చినా.. విచారణ అనంతరం ఆయనను సిట్ అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఎప్పుడైతే చెవిరెడ్ది అరెస్టు అయ్యారో… మోహిత్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ తో పాటు మరో నలుగురిని కొత్తగా కేసులో నిందితులుగా చేర్చగా… వీరిలో ఇప్పటిదాకా భాస్కర్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. మోహిత్ తో పాటు ఇంకో నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. మంగళవారం మోహిత్ విచారణకు హాజరుకాకపోతే…వీరిద్దరి కోసం సిట్ జల్లెడ పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే… మోహిత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. లండన్ ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అందులో డిస్టింక్షన్ పాసై గర్వంగా చంద్రగిరి చేరుకున్నారు. మోహిత్ చదువుకున్న రంగంలోనే ఆయన కొనసాగి ఉంటే… ఈ అరెస్టుల గోలే ఉండేది కాదు. అయితే జగన్ ఒక్కసారి సీఎం కాగానే భాస్కరరెడ్డి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఉన్నత ఉద్యోగంలో కొనసాగాల్సిన తన కుమారుడిని రాజకీయాల్లోకి దింపారు. మొన్నటి ఎన్నికల్లో తన స్థానంలో మోహిత్ ని నిలిపారు. అయితే తండ్రితో పాటు మోహిత్ కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మోహిత్ ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…