Political News

జ‌గ‌న్‌…. రెడ్డి మంత్రం ..!

రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైసిపి తర్జనభర్జన పడుతోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి కులం లేదు మతం లేదు అని చెప్పుకున్న జనసేనలో సామాజిక వర్గాల సమీకరణ బాగుంటే.. రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీలో ఇప్పుడు వారే దూరంగా ఉన్నారు. వాస్తవానికి పైకి జనసేన మతం లేదు కులం లేదు అని చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల్లో నెలకొన్న బలమైన సింపతీని ఒడిసి పట్టుకుని గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను సామాజిక వర్గాల ఆధారంగానే పరుగులు పెట్టించింది. ఫలితంగా కాపులందరూ ఐక్యమయ్యారు.

గత విభేదాలను కూడా మరిచిపోయి ఇతర సామాజిక వర్గాలతో కలివిడిగా ముందుకు సాగారు. వైసిపి విషయానికి వస్తే జగన్ను గెలిపించుకోకపోతే రెడ్డి సామాజిక వర్గానికి భవిష్యత్తు లేదని భావించిన ఆ సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో ఐక్యంగా నిలబడి జగన్ కోసం పని చేసింది. ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో చేసిన పాదయాత్రను మించి రెడ్ల మధ్య ఐక్యతను తీసుకొచ్చింది. కానీ ఈ ఐక్యతను రెడ్డి సామాజిక వర్గం సింప‌తీని కాపాడుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు.

గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారికంగా సీఎం హోదాలో ఉండి ఒక్కసారి కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గంతో భేటీ కాలేదు. అంతేకాదు రెడ్డి సామాజిక వర్గం అంచనాలను కూడా అందుకోలేకపోయారు. వారేమీ పూర్తిగా మంత్రివర్గాన్ని రెడ్లమయం చేయమని కానీ అన్ని పదవులు రెడ్డి సామాజివర్గానికి ఇవ్వమని గాని కోరలేదు. వ్యాపార పరంగా ఇతర అంశాల పరంగా తమకు వెసులుబాటు కల్పించాలని కోరుకున్నారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి.

ఈ విషయాన్ని గమనించి కూడా జగన్ విస్మరించారా, లేక ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు తనను కాపాడుతుందని అంచనా వేసుకున్నారా, లేక మహిళా ఓటు బ్యాంకు తన రక్షిస్తుందని అనుకున్నారా అనేది పక్కన పెడితే మొత్తానికి రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం ఆయన దూరం చేసుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం విలువ తెలిసి వచ్చింది. రెడ్లు కనక కలివిడిగా ఉండి ఉంటే ఏదో ఒక రకంగా పార్టీ గెలిచి ఉండేది. కానీ రెడ్డి సామాజిక వర్గమే కక్ష కట్టినట్టుగా వ్యవహరించి వైసిపి పరాజ‌యానికి కారణమైంది.

మా నాయకుడే మమ్మల్ని పట్టించుకోలేదు అన్న ధోరణ కనిపించింది. ఇది ప్రత్యర్థ టీడీపీకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ సింపతి ఉంటే అక్కడ ఓట్లు ఉంటాయన్న కీలక సూత్రం చంద్రబాబు కు తెలుసు కాబట్టే దీనిని ఆయన చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపికి ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు ఎలా ఉన్నా… రెడ్ల సామాజిక వర్గం మద్దతు మాత్రం కచ్చితంగా అవసరం. వారిని తన వైపు నిలుపుకునే దిశగా ఆయన అడుగులు వేయాలి. వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. భవిష్యత్తును నిర్దేశం చేసుకోవాలి. లేకపోతే సామాజిక వర్గాల ఆధారంగా ఆధారపడిన రాజకీయాలు వైసిపికి ఎదురు తిరగడం ఖాయం.

This post was last modified on June 28, 2025 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago