Political News

జ‌గ‌న్‌…. రెడ్డి మంత్రం ..!

రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైసిపి తర్జనభర్జన పడుతోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి కులం లేదు మతం లేదు అని చెప్పుకున్న జనసేనలో సామాజిక వర్గాల సమీకరణ బాగుంటే.. రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీలో ఇప్పుడు వారే దూరంగా ఉన్నారు. వాస్తవానికి పైకి జనసేన మతం లేదు కులం లేదు అని చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల్లో నెలకొన్న బలమైన సింపతీని ఒడిసి పట్టుకుని గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను సామాజిక వర్గాల ఆధారంగానే పరుగులు పెట్టించింది. ఫలితంగా కాపులందరూ ఐక్యమయ్యారు.

గత విభేదాలను కూడా మరిచిపోయి ఇతర సామాజిక వర్గాలతో కలివిడిగా ముందుకు సాగారు. వైసిపి విషయానికి వస్తే జగన్ను గెలిపించుకోకపోతే రెడ్డి సామాజిక వర్గానికి భవిష్యత్తు లేదని భావించిన ఆ సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో ఐక్యంగా నిలబడి జగన్ కోసం పని చేసింది. ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో చేసిన పాదయాత్రను మించి రెడ్ల మధ్య ఐక్యతను తీసుకొచ్చింది. కానీ ఈ ఐక్యతను రెడ్డి సామాజిక వర్గం సింప‌తీని కాపాడుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు.

గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారికంగా సీఎం హోదాలో ఉండి ఒక్కసారి కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గంతో భేటీ కాలేదు. అంతేకాదు రెడ్డి సామాజిక వర్గం అంచనాలను కూడా అందుకోలేకపోయారు. వారేమీ పూర్తిగా మంత్రివర్గాన్ని రెడ్లమయం చేయమని కానీ అన్ని పదవులు రెడ్డి సామాజివర్గానికి ఇవ్వమని గాని కోరలేదు. వ్యాపార పరంగా ఇతర అంశాల పరంగా తమకు వెసులుబాటు కల్పించాలని కోరుకున్నారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి.

ఈ విషయాన్ని గమనించి కూడా జగన్ విస్మరించారా, లేక ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు తనను కాపాడుతుందని అంచనా వేసుకున్నారా, లేక మహిళా ఓటు బ్యాంకు తన రక్షిస్తుందని అనుకున్నారా అనేది పక్కన పెడితే మొత్తానికి రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం ఆయన దూరం చేసుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం విలువ తెలిసి వచ్చింది. రెడ్లు కనక కలివిడిగా ఉండి ఉంటే ఏదో ఒక రకంగా పార్టీ గెలిచి ఉండేది. కానీ రెడ్డి సామాజిక వర్గమే కక్ష కట్టినట్టుగా వ్యవహరించి వైసిపి పరాజ‌యానికి కారణమైంది.

మా నాయకుడే మమ్మల్ని పట్టించుకోలేదు అన్న ధోరణ కనిపించింది. ఇది ప్రత్యర్థ టీడీపీకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ సింపతి ఉంటే అక్కడ ఓట్లు ఉంటాయన్న కీలక సూత్రం చంద్రబాబు కు తెలుసు కాబట్టే దీనిని ఆయన చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపికి ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు ఎలా ఉన్నా… రెడ్ల సామాజిక వర్గం మద్దతు మాత్రం కచ్చితంగా అవసరం. వారిని తన వైపు నిలుపుకునే దిశగా ఆయన అడుగులు వేయాలి. వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. భవిష్యత్తును నిర్దేశం చేసుకోవాలి. లేకపోతే సామాజిక వర్గాల ఆధారంగా ఆధారపడిన రాజకీయాలు వైసిపికి ఎదురు తిరగడం ఖాయం.

This post was last modified on June 28, 2025 10:48 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

15 minutes ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

2 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

2 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

4 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

7 hours ago