వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట.
సరే… సొంతూరు అన్న తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నా ఎప్పుడో అప్పుడు అక్కడికి తరలివెళ్లాల్సిందే. కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. తన సొంతూరును చూసి పోదామని నాని గుడివాడకేమీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన గుడివాడలో అడుగుపెట్టక తప్పలేదు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రావి వెంటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై వైసీపీ జమానాలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నాడే కేసు నమోదు కాగా..ఇప్పుడు ఆ కేసు ఒకింత నిందితులను చుట్టేస్తోంది.
ఈ కేసులో కొడాలి నాని నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు పూర్వపరాలు, నాని ఆరోగ్య పరిస్తితులను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఓ లింకు పెట్టింది. స్థానిక కోర్టులో జామీను పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకోమని చెప్పింది. దీంతో కొడాలి నాని తనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత గుడివాడలో అడుగు పెట్టక తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైపీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని… నాటి విపక్షం, నేటి కూటమి రథసారధి టీడీపీపై తనదైన శైలిలో దూషణలకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన నాని… అందరితోనూ ఈయన ఓ బూతు మంత్రి అని ముద్ర వేయించుకున్నారు. మొన్నామధ్య వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినప్పుడు విజయవాడలో కనిపించిన నాని… ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. హైదరాబాద్, ముంబైల్లో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
This post was last modified on June 27, 2025 5:54 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…