వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట.
సరే… సొంతూరు అన్న తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నా ఎప్పుడో అప్పుడు అక్కడికి తరలివెళ్లాల్సిందే. కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. తన సొంతూరును చూసి పోదామని నాని గుడివాడకేమీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన గుడివాడలో అడుగుపెట్టక తప్పలేదు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రావి వెంటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై వైసీపీ జమానాలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నాడే కేసు నమోదు కాగా..ఇప్పుడు ఆ కేసు ఒకింత నిందితులను చుట్టేస్తోంది.
ఈ కేసులో కొడాలి నాని నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు పూర్వపరాలు, నాని ఆరోగ్య పరిస్తితులను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఓ లింకు పెట్టింది. స్థానిక కోర్టులో జామీను పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకోమని చెప్పింది. దీంతో కొడాలి నాని తనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత గుడివాడలో అడుగు పెట్టక తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైపీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని… నాటి విపక్షం, నేటి కూటమి రథసారధి టీడీపీపై తనదైన శైలిలో దూషణలకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన నాని… అందరితోనూ ఈయన ఓ బూతు మంత్రి అని ముద్ర వేయించుకున్నారు. మొన్నామధ్య వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినప్పుడు విజయవాడలో కనిపించిన నాని… ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. హైదరాబాద్, ముంబైల్లో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…