వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట.
సరే… సొంతూరు అన్న తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నా ఎప్పుడో అప్పుడు అక్కడికి తరలివెళ్లాల్సిందే. కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. తన సొంతూరును చూసి పోదామని నాని గుడివాడకేమీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన గుడివాడలో అడుగుపెట్టక తప్పలేదు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రావి వెంటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై వైసీపీ జమానాలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నాడే కేసు నమోదు కాగా..ఇప్పుడు ఆ కేసు ఒకింత నిందితులను చుట్టేస్తోంది.
ఈ కేసులో కొడాలి నాని నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు పూర్వపరాలు, నాని ఆరోగ్య పరిస్తితులను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఓ లింకు పెట్టింది. స్థానిక కోర్టులో జామీను పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకోమని చెప్పింది. దీంతో కొడాలి నాని తనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత గుడివాడలో అడుగు పెట్టక తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైపీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని… నాటి విపక్షం, నేటి కూటమి రథసారధి టీడీపీపై తనదైన శైలిలో దూషణలకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన నాని… అందరితోనూ ఈయన ఓ బూతు మంత్రి అని ముద్ర వేయించుకున్నారు. మొన్నామధ్య వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినప్పుడు విజయవాడలో కనిపించిన నాని… ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. హైదరాబాద్, ముంబైల్లో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
This post was last modified on June 27, 2025 5:54 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…