తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయా అలియాస్ సీతక్కకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. నిషేధిత మావోయిస్టుల నుంచి ఆమెకు బెదిరింపుల లేఖ వచ్చిందని, అందులో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు సీతక్కను హెచ్చరించారట. ఈ విషయాన్ని సీతక్క కూడా ధృవీకరించారు. తనకు మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన ఆమె… అది నిజమైన మావోయిలస్టుల నుంచి వచ్చిందా? లేదంటే తనను రాజకీయంగా నాశనం చేసేందుకు యత్నించే శక్తుల పనా? అని ఆమె ప్రశ్నించారు.
వాస్తవానికి సీతక్క పూర్వాశ్రమంలో మావోయిస్టే. నాడు మావోయిస్టులను నక్సలైట్లుగా పిలిచేవాళ్లం. ఆదివాసీ తెగకు చెందిన సీతక్క.. చిన్న వయసులోనే నక్సలిజం సిద్ధాంతాలకు ఆకర్షితురాలై నక్సలైట్లలో కలిసిపోయారు. ఏళ్ల తరబడి నక్సలైట్ గానే కొనసాగారు. ప్రభుత్వ విధానాలపై పోరాడారు. ఇక నక్సలైట్లు పాల్పడ్డ హింసాత్మక ఘటనల్లో ఆమె పాలుపంచుకున్నారా? లేదా? అన్న దానిపై అయితే స్పష్టత లేదనే చెప్పాలి. ఎంతైనా ఏళ్ల తరబడి నక్సలైట్ గా కొనసాగిన సీతక్క… ఉమ్మడి రాష్ట్ర సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజా జీవితంలో కలిసిపోయారు. సీతక్క ఉత్సాహాన్ని చూసిన బాబు..ఆమెను టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
ఈ లెక్కన సీతక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం అన్నది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నా… వాటిని చిన్నచిన్నగా సరిదిద్దుకుంటూ సీతక్క సాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా… నిత్యం తన ఆదివాసీ బిడ్డల సంక్షేమమే లక్ష్యంగా సాగే సీతక్క… హైదరాబాద్ లో కంటే కూడా కొండలు, కోనల్లోనూ తిరుగుతూ కనిపిస్తారు. ఇప్పుడంటే మంత్రి పదవిలో అది కూడా పంచాయతీరాజ్ శాఖ లాంటి కీలక శాఖ మంత్రిగా ఉన్న ఆమె కాస్తంత బిజీ అయినా కూడా అప్పుడప్పుడూ తన వర్గం వద్దకు వెళుతూనే ఉన్నారు.
తనకు వచ్చిన మావోయిస్టుల లేఖను ఉద్దేశించి సీతక్క శుక్రవారం ఘాటుగానే స్పందించారు. మావోయిస్టుల నుంచి లేఖ అయితే వచ్చింది గానీ… అది నిజమైన మావోయిస్టులు రాసిందా? లేదంటే మావోయిస్టుల పేరిట తన కాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్న తన ప్రత్యర్థుల పనా? అన్నది ముందు తేలాలని ఆమె అన్నారు. అయినా తొలిసారి ఓ ఆదివాసీ బిడ్డ మంత్రిగా ఉండటం కొందరికి కడుపు మంటగా ఉందన్న సీతక్క.. తన మంత్రి పదవిని ఊడగొట్టేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. చూడాలి మరి.. ఈ లేఖ ఎవరు రాశారో?
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…