విజయసాయి రెడ్డి. వైసీపీ కీలక నాయకుడు.అయితే.. ఇప్పుడు ఆయన లేని లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించి, పార్టీని ముందుకు నడిపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వైసిపి వ్యవహారాలను భుజాన వేసుకుని చక్కదిద్దారు. జగన్ తర్వాత వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు బాగా వినిపించేది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ 2014 -19 మధ్య కాలంలో మాత్రం జగన్ తర్వాతే ఎవరూ అంటే విజయసాయిరెడ్డి పేరు బలంగా అందరూ చెప్పేవారు.
అలాగే ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డి పేరు మార్మోగింది. అలాంటిది పరిస్థితుల ప్రభావం, రాజకీయాల ప్రభావమో తెలియదు కానీ విజయ సాయి రెడ్డి వైసీపీని వదిలేసి ఆరు మాసాల పైనే అయిపోయింది. అయితే ఇప్పటివరకు కూడా విజయసాయి రెడ్డి తరహా రాజకీయాలు చేయగలిగే నాయకుడు, పార్టీని లౌక్యంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు వైసీపీలో కనిపించలేదు, వాస్తవానికి ఒక పోస్టు ఖాళీ అయితే వెంటనే ఆ పోస్టును భర్తీ చేసేందుకు ఎవరో ఒకరిని నియమిస్తారు, ఇది అన్ని పార్టీలలోను ఉన్న విషయమే.
అయితే వైసీపీ విషయానికి వచ్చేసరికి విజయ సాయి రెడ్డి పోషించిన పాత్ర, నిర్వహించిన పదవులు ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి, పార్టీ వ్యవహారాలు కావచ్చు, ఢిల్లీలో రాజకీయ వ్యవహారాలు కావచ్చు.. ఏవైనా తనదైన శైలిలో అయిన ముందుకు తీసుకెళ్లారు, నాటి నుంచి నేటి వరకు అంటే విజయ సాయి రెడ్డి పార్టీని వదిలేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ పదవిని ఎవరికి ఇవ్వలేదు, ఆ పోస్టును ఇప్పటివరకు భర్తీ చేయలేదు.
అంటే సాయి రెడ్డికి సమానమైనటువంటి నాయకుడు లేడని భావిస్తున్నారా లేకపోతే ఆయన మళ్లీ తమ పార్టీలోకే వస్తారని అనుకుంటున్నారో తెలియదు గానీ సాయి రెడ్డి వ్యవహారం తాజాగా పార్టీ నాయకుల మధ్య చర్చకు రావడం గమనార్హం. దీంతో ఆ పోస్ట్ గురించి, ఆయన గురించి ఎవరూ మాట్లాడద్దు అంటూ ఒక కీలక నాయకుడు సూచించారు. దీంతో సాయి రెడ్డి లేని లోటు ఆయన పాత్ర వంటివి బలమైన ముద్రవేశాయి అనేది స్పష్టంగా కనిపించింది, మరి భవిష్యత్తులో ఈ పోస్టును ఎవరితోనైనా భర్తీ చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా అనేది వేచి చూడాలి, లేకపోతే సాయిరెడ్డే వస్తారో చూడాలి.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…