జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిందో లెక్కలేదు. పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారాలు ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన రూమర్ ఒకటి. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ చెప్పాడంటూ… దాని మీద విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. పవన్ ఎప్పుడైనా చిన్న మాట తడబడ్డా.. 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ ఎద్దేవా చేస్తుంటారు. ఐతే ఇలా ట్రోల్ చేసే వారికి పవన్ సోదరుడు నాగబాబు ఒక ఇంటర్వ్యూలో దీటైన సమాధానం ఇచ్చారు.
తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ ఎప్పుడూ చెప్పలేదని.. దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే పెట్టాలని నాాగబాబు సవాలు విసిరారు. నిజానికి పవన్ పుస్తక పఠనం గురించి తమ తండ్రి వెంకట్రావు ఒక సందర్భంలో ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారని.. కానీ ఆయన చెప్పింది ఒకటైతే ఆ జర్నలిస్టు రాసింది మరొకటి అని నాగబాబు అన్నారు. పవన్ దగ్గర రూ.2 లక్షల విలువైన పుస్తకాలు ఉన్నాయని.. ఎప్పట్నుంచో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడని.. చాలా శ్రద్ధగా పుస్తకాలు చదువుతాడని మాత్రమే తమ తండ్రి పేర్కొన్నారని.. కానీ ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్టు మాత్రం పవన్ 2 లక్షల పుస్తకాలు చదివినిట్లు రాశాడని నాగబాబు చెప్పారు.
అసలు ప్రపంచంలో ఎవ్వరైనా అన్ని పుస్తకాలు చదువుతారా… అన్ని పుస్తకాలు చదివామని చెప్పుకుంటారా అని నాగబాబు ప్రశ్నించారు. అసలు తాను ఎన్ని పుస్తకాలు చదివానన్నది పవన్ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదని.. ఈ కామెంట్ పవన్ చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని నాగబాబు సవాలు విసిరారు. గతంలో పవన్ మిత్రుడొకరు కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం 2 లక్షల పుస్తకాలు అంటూ పవన్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు.
This post was last modified on June 25, 2025 9:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…