జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిందో లెక్కలేదు. పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారాలు ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన రూమర్ ఒకటి. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ చెప్పాడంటూ… దాని మీద విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. పవన్ ఎప్పుడైనా చిన్న మాట తడబడ్డా.. 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ ఎద్దేవా చేస్తుంటారు. ఐతే ఇలా ట్రోల్ చేసే వారికి పవన్ సోదరుడు నాగబాబు ఒక ఇంటర్వ్యూలో దీటైన సమాధానం ఇచ్చారు.
తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ ఎప్పుడూ చెప్పలేదని.. దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే పెట్టాలని నాాగబాబు సవాలు విసిరారు. నిజానికి పవన్ పుస్తక పఠనం గురించి తమ తండ్రి వెంకట్రావు ఒక సందర్భంలో ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారని.. కానీ ఆయన చెప్పింది ఒకటైతే ఆ జర్నలిస్టు రాసింది మరొకటి అని నాగబాబు అన్నారు. పవన్ దగ్గర రూ.2 లక్షల విలువైన పుస్తకాలు ఉన్నాయని.. ఎప్పట్నుంచో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడని.. చాలా శ్రద్ధగా పుస్తకాలు చదువుతాడని మాత్రమే తమ తండ్రి పేర్కొన్నారని.. కానీ ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్టు మాత్రం పవన్ 2 లక్షల పుస్తకాలు చదివినిట్లు రాశాడని నాగబాబు చెప్పారు.
అసలు ప్రపంచంలో ఎవ్వరైనా అన్ని పుస్తకాలు చదువుతారా… అన్ని పుస్తకాలు చదివామని చెప్పుకుంటారా అని నాగబాబు ప్రశ్నించారు. అసలు తాను ఎన్ని పుస్తకాలు చదివానన్నది పవన్ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదని.. ఈ కామెంట్ పవన్ చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని నాగబాబు సవాలు విసిరారు. గతంలో పవన్ మిత్రుడొకరు కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం 2 లక్షల పుస్తకాలు అంటూ పవన్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు.
This post was last modified on June 25, 2025 9:01 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…