జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి తమిళనాడు పర్యటన అక్కడ అగ్గి రాజేసింది. తమిళనాడులోని మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్… సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. నకిలీ సెక్యూలరిజంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపుగా పవన్ కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమన్న సత్యరాజ్… పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరూ మోసం చేయలేరని అన్నారు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి వక్కువ తనమే అవుతుందని ఆయన ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే…మురుగన్ మానాడులో పవన్ కల్యాణ్ పాల్గొనడం, ప్రసంగించడంపై డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అసలు తమిళనాడుతో మీకేం సంబంధం అని కూడా పవన్ ను ప్రశ్నించిన శేఖర్… మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కూడా ఆయన పవన్ కు సవాల్ విసిరారు. తాజాగా సత్యరాజ్ ఏకంగా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించడం గమనార్హం.
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…