Political News

వైసీపీ అన్యాయాన్ని కూటమి సరిదిద్దింది!

మైనేని సాకేత్… టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఏపీ క్రీడాకారుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడికి అర్జున అవార్డును కూడా ప్రకటించింది. అంతటి ప్రతిభావంతుడైన మైనేని… జగన్ కు మాత్రం కంటిగింపుగా కనిపించాడు. స్పోర్ట్స్ కోటాలో అతడికి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా అందుకు మోకాలొడ్డాడు. ఆ అన్యాయాన్ని ఇప్పుడు కూటమి సర్కారు సరిదిద్దింది. మైనేనికి గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్ కు సరిసమానమైన ఉద్యోగాన్ని ఇవ్వాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది.

జగన్ జమానాలో తనకు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చేసినట్టేనని సాకేత్ గట్టిగా నమ్మాడు. ఎందుకంటే… కేంద్రం ఇచ్చిన అర్జున అవార్డు నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో తాను ఆ పోస్టుకు అర్హుడినని అతడు విశ్వసించాడు. అయితే కారణం ఏమిటో తెలియదు గానీ జగన్ సర్కారు సాకేత్ వినతిని అసలు పరిగణనలోకే తీసుకోలేదు. చాలా కాలం పాటు వేచి చూసిన సాకేత్ ఇక తనకు ఉద్యోగం దక్కదని ఓ అంచనాకు వచ్చేశాడు. ఉద్యోగంపై ఆశలు వదులుకున్నాడు.

అయితే ఎప్పుడైతే ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కారు అధికారం చేపట్టిందో సాకేత్ లో మళ్లీ ఉద్యోగంపై ఆశలు చిగురించాయి. సమయం చూసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశాడు. జగన్ పాలనలో తనకు జరిగిన అన్యాయాన్ని అతడు లోకేశ్ కు వివరించాడు. విషయం మొత్తం విన్న లోకేశ్.. జగన్ జమానాలో అన్యాయం జరిగితే… మేం న్యాయం చేస్తామని సాకేత్ కు హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే సాకేత్ కు గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూటమి సర్కారు ఇచ్చింది.

This post was last modified on June 25, 2025 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago