Political News

జగన్ పై మరో కేసు.. విచారణలు తప్పవా?

ఏపీలో విపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో 24 కేసులున్న జగన్ పై మొన్న వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై ఓ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవలే మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందామంటూ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారుల అనుమతి లేకుండానే జగన్ నిర్వహించిన ఈ పర్యటనపై గుంటూరు లోని నల్లపాడు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన సమయంలో గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ ను కూడా పట్టించుకోకుండా జగన్ భారీ జనంతో గుంటూరు మిర్చి యార్డుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మిర్చి యార్డులో రైతుల మిర్చి టిక్కీలను ఇష్టారాజ్యంగా తొక్కి నాశనం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ను విస్మరిస్తూ జగన్ అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. వీటన్నింటిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా సోమవారం జగన్ పై కేసు నమోదు చేశారు.

జగన్ తో పాటు నాడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులపై నల్లపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో పోలీసులు జగన్ సహా మిగిలిన నిందితులకు ఆదేశాలు జారీ చేశారు.

రాజకీయ నేతలన్నాక కేసుల నమోదు వరకు అందరికీ ఓకే గానీ… ఓ సీఎం హోదాలో ఐదేళ్ల పాటు పనిచేసిన జగన్ లాంటి నేతలను ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కోసం పిలిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పక తప్పదు. పోలీసుల స్పీడు చూస్తుంటే.. జగన్ ను విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపై అప్పుడు విశ్లేషణలు మొదలైపోయాయి.

This post was last modified on June 24, 2025 5:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago