Political News

జగన్ పై మరో కేసు.. విచారణలు తప్పవా?

ఏపీలో విపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో 24 కేసులున్న జగన్ పై మొన్న వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై ఓ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవలే మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందామంటూ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారుల అనుమతి లేకుండానే జగన్ నిర్వహించిన ఈ పర్యటనపై గుంటూరు లోని నల్లపాడు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన సమయంలో గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ ను కూడా పట్టించుకోకుండా జగన్ భారీ జనంతో గుంటూరు మిర్చి యార్డుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మిర్చి యార్డులో రైతుల మిర్చి టిక్కీలను ఇష్టారాజ్యంగా తొక్కి నాశనం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ను విస్మరిస్తూ జగన్ అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. వీటన్నింటిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా సోమవారం జగన్ పై కేసు నమోదు చేశారు.

జగన్ తో పాటు నాడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులపై నల్లపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో పోలీసులు జగన్ సహా మిగిలిన నిందితులకు ఆదేశాలు జారీ చేశారు.

రాజకీయ నేతలన్నాక కేసుల నమోదు వరకు అందరికీ ఓకే గానీ… ఓ సీఎం హోదాలో ఐదేళ్ల పాటు పనిచేసిన జగన్ లాంటి నేతలను ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కోసం పిలిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పక తప్పదు. పోలీసుల స్పీడు చూస్తుంటే.. జగన్ ను విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపై అప్పుడు విశ్లేషణలు మొదలైపోయాయి.

This post was last modified on June 24, 2025 5:43 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

32 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago