Political News

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. కియా సంస్థను తాను తీసుకువచ్చానని.. కానీ వైసీపీ బెదిరించడంతో వారు రెండో విభాగాన్ని చెన్నైకి తరలించారన్నారు.

అదేవిధంగా విశాఖకు రావాల్సిన లూలూ కంపెనీని కూడా లంచాల కోసం, కమీషన్ల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా వెనక్కి పోయిందన్నారు. ఇలా పెట్టుబడిదారులను బెదిరించారని.. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు. వీటిని ఇప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. కానీ ఇక ఆ భూతం అధికారంలోకి రాదని చెబుతున్నామన్నారు. ఆ భూతాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు.. వీటిని కూడా రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. వారిని అణిచేస్తామన్నారు.

అదేసమయంలో ప్రతి విషయంలోనూ.. ప్రతి శాఖలోనూ వైసీపీ అరాచకం చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అవినీతికి ఆలవాలంగా మార్చేశారన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు.. పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్రాకెట్ల నుంచి కోడిగుడ్ల వరకు కూడా అన్నీ అవినీతి చేశారన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.

నాలుగు సంతకాలు నెరవేర్చా..

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తాను నాలుగు సంతకాలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని నెరవేర్చినట్టు తెలిపారు:

  1. మెగా డీఎస్సీపై సంతకం
  2. అన్నా క్యాంటీన్లు
  3. రాజధాని అమరావతి పునర్నిర్మాణం
  4. పోలవరం పనులపై సంతకం

ఈ నాలుగు కూడా సాధించామన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను 213 ప్రారంభించి పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఇవి పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago