Political News

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. కియా సంస్థను తాను తీసుకువచ్చానని.. కానీ వైసీపీ బెదిరించడంతో వారు రెండో విభాగాన్ని చెన్నైకి తరలించారన్నారు.

అదేవిధంగా విశాఖకు రావాల్సిన లూలూ కంపెనీని కూడా లంచాల కోసం, కమీషన్ల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా వెనక్కి పోయిందన్నారు. ఇలా పెట్టుబడిదారులను బెదిరించారని.. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు. వీటిని ఇప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. కానీ ఇక ఆ భూతం అధికారంలోకి రాదని చెబుతున్నామన్నారు. ఆ భూతాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు.. వీటిని కూడా రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. వారిని అణిచేస్తామన్నారు.

అదేసమయంలో ప్రతి విషయంలోనూ.. ప్రతి శాఖలోనూ వైసీపీ అరాచకం చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అవినీతికి ఆలవాలంగా మార్చేశారన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు.. పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్రాకెట్ల నుంచి కోడిగుడ్ల వరకు కూడా అన్నీ అవినీతి చేశారన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.

నాలుగు సంతకాలు నెరవేర్చా..

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తాను నాలుగు సంతకాలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని నెరవేర్చినట్టు తెలిపారు:

  1. మెగా డీఎస్సీపై సంతకం
  2. అన్నా క్యాంటీన్లు
  3. రాజధాని అమరావతి పునర్నిర్మాణం
  4. పోలవరం పనులపై సంతకం

ఈ నాలుగు కూడా సాధించామన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను 213 ప్రారంభించి పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఇవి పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

This post was last modified on June 24, 2025 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

3 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

4 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

5 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

7 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

7 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

8 hours ago