Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. కియా సంస్థను తాను తీసుకువచ్చానని.. కానీ వైసీపీ బెదిరించడంతో వారు రెండో విభాగాన్ని చెన్నైకి తరలించారన్నారు.
అదేవిధంగా విశాఖకు రావాల్సిన లూలూ కంపెనీని కూడా లంచాల కోసం, కమీషన్ల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా వెనక్కి పోయిందన్నారు. ఇలా పెట్టుబడిదారులను బెదిరించారని.. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు. వీటిని ఇప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. కానీ ఇక ఆ భూతం అధికారంలోకి రాదని చెబుతున్నామన్నారు. ఆ భూతాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు.. వీటిని కూడా రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. వారిని అణిచేస్తామన్నారు.
అదేసమయంలో ప్రతి విషయంలోనూ.. ప్రతి శాఖలోనూ వైసీపీ అరాచకం చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అవినీతికి ఆలవాలంగా మార్చేశారన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు.. పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్రాకెట్ల నుంచి కోడిగుడ్ల వరకు కూడా అన్నీ అవినీతి చేశారన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తాను నాలుగు సంతకాలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని నెరవేర్చినట్టు తెలిపారు:
ఈ నాలుగు కూడా సాధించామన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను 213 ప్రారంభించి పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఇవి పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
This post was last modified on June 24, 2025 1:56 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…