Political News

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. కియా సంస్థను తాను తీసుకువచ్చానని.. కానీ వైసీపీ బెదిరించడంతో వారు రెండో విభాగాన్ని చెన్నైకి తరలించారన్నారు.

అదేవిధంగా విశాఖకు రావాల్సిన లూలూ కంపెనీని కూడా లంచాల కోసం, కమీషన్ల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా వెనక్కి పోయిందన్నారు. ఇలా పెట్టుబడిదారులను బెదిరించారని.. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు. వీటిని ఇప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. కానీ ఇక ఆ భూతం అధికారంలోకి రాదని చెబుతున్నామన్నారు. ఆ భూతాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు.. వీటిని కూడా రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. వారిని అణిచేస్తామన్నారు.

అదేసమయంలో ప్రతి విషయంలోనూ.. ప్రతి శాఖలోనూ వైసీపీ అరాచకం చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అవినీతికి ఆలవాలంగా మార్చేశారన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు.. పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్రాకెట్ల నుంచి కోడిగుడ్ల వరకు కూడా అన్నీ అవినీతి చేశారన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.

నాలుగు సంతకాలు నెరవేర్చా..

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తాను నాలుగు సంతకాలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని నెరవేర్చినట్టు తెలిపారు:

  1. మెగా డీఎస్సీపై సంతకం
  2. అన్నా క్యాంటీన్లు
  3. రాజధాని అమరావతి పునర్నిర్మాణం
  4. పోలవరం పనులపై సంతకం

ఈ నాలుగు కూడా సాధించామన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను 213 ప్రారంభించి పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఇవి పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

This post was last modified on June 24, 2025 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

51 minutes ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

2 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

2 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

5 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

6 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

9 hours ago