Political News

బాబు గారూ!… ఇదేం స్టామినా సారూ!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వయస్తు ప్రస్తుతం అక్షరాలా 76 ఏళ్లు. ఇన్నేళ్ల వయసులో ఇతరులైతే ఏ వీల్ చైర్ కో, లేదంటే ఒకింత నడుస్తున్నా… పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు. అయితే చంద్రబాబు ఏకంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించి… అది కూడా నిలబడి మరీ ప్రసంగించి… అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. 1.45 గంటల సేపు ఆయన వేదిక మీద ఒకే చోట నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ తరం యువకులనే షాక్ కు గురి చేశారు.

కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అదికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత మైకు అందుకున్న చంద్రబాబు నాన్ స్టాప్ గా 1.45 గంటల పాటు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కొనసాగించారు.

ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న స్లైడ్ లను అలా రన్ చేస్తూ… వాటిలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ చంద్రబాబు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజెంటేషన్ ను చూస్తుంటే… ఆ స్లైడ్ లన్నింటినీ చంద్రబాబే రూపొందించుకున్నారేమో అనే భావన కూడా కలగక మానదు. దాదాపుగా అన్ని ప్రభుత్వా శాఖల పనితీరు, ఆయా సంక్షేమ పథకాల అమలు తీరు, త్వరలో ప్రారంబించబోయే పథకాలు వివరాలు… ఆయా పథకాల వల్ల జనానికి కలిగే లాభం, ప్రభుత్వంపై పడే బారం… అంతిమంగా సమాజం అభివృద్ధి చెందే తీరు, జీఎస్డీపీ పెరిగే తీరు తదితరాలను చంద్రబాబు ఓ లెక్చరర్ మాదిరిగా అలా చెప్పుకుంటూ వెళ్లారు.

బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరు కునికిపాట్లు పడ్డా… చంద్రబాబు వాయిస్ తో తిరిగి లేచి ఆయన చెప్పే విషయాలను వినడంలో నిమగ్నమైన తీరు కనిపించింది. తాను ప్రసంగిస్తున్నంతసేపూ బాబు కూర్చోలేదు. ఏ సపోర్ట్ నూ పట్టుకోలేదు. అంతేనా… ఓ చేతిలో మైకును, మరో చేతిలో పిన్ పాయింటర్ ను పట్టుకుని బాబు అలా సాగిపోయారు. ఈ తరహా ప్రసంగాలకు బాబు తన తలకు అమర్చుకునే స్పీకర్ ను వాడతారు గానీ..ఎందుకనో సోమవారం నాటి సభలో మాత్రం ఆయన చేతి మైకునే వినియోగించారు.

This post was last modified on June 24, 2025 9:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

35 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

53 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago