Political News

ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు… : నారా లోకేష్

గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూటమి పార్టీలు కాదు, ప్ర‌జ‌లే గెలిచార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో ఐదు సంవ‌త్స‌రాలు.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని గ‌డిపిన ప్ర‌జ‌లు కూట‌మి వైపు ఏక‌ప‌క్షంగా నిలిచార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వారంతా సుఖ శాంతుల‌తో జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌శ్నించినా.. స‌మ‌స్య ల‌పై స్పందించినా… లాఠీలు విరిగాయ‌ని.. జైళ్లు నిండిపోయాయ‌ని అన్నారు. అందుకే ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని.. అదే గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను గెలిపించేలా చేసింద‌ని నారా లోకేష్ అన్నారు.

అమ‌రావ‌తిలో సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన `సుప‌రిపాల‌న‌లో తొలి అడుగుకు ఏడాది` కార్య‌క్ర‌మంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నియంత పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన స్వ‌తంత్రం ల‌భించింద‌న్నారు. కూట‌మి ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వ‌నంతగా పెంచి రూ.4000 చొప్పున అందిస్తున్నామ‌న్నారు. దివ్యాంగుల‌కు రూ.6000 చొప్పున ఇస్తామ‌ని చెప్పారు. `త‌ల్లికి వంద‌నం` పేరుతో అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కంలో ఎంత మంది త‌ల్లులు ఉన్నా అంద‌రికీ రూ.13000 చొప్పున ఇచ్చామ‌ని, 1వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు దీనిని అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని నారా లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. ఒక్క పెట్టుబ‌డిని కూడా తీసుకు రాలేద‌ని.. గ‌త టీడీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌ను కూడా త‌రిమేశార‌ని విమ‌ర్శించారు. వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఒక్క దానిని కూడా ప‌ట్టించుకోలేద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నామ‌న్నారు. వైసీపీ తెచ్చిన చెత్త‌పై ప‌న్నును ర‌ద్దు చేశామ‌ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఊపిరిలూదామ‌ని అన్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం లో తొలి ఏడాదిలోనే 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌ని.. వివ‌రించారు. భ‌విష్యత్తులో 20 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు క‌ల్పించే దిశ‌గా దీనికి రెండింత‌లు ఉపాధి కూడా ల‌భించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఇప్పుడు ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ యోగాతో రాష్ట్రం కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయ‌ని మంత్రి చెప్పారు.

This post was last modified on June 23, 2025 9:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కేవలం ‘టీవీ సౌండ్’ గొడవ వల్లే భర్తను భార్య పొడిచిందా?

కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…

1 hour ago

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

12 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

12 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

13 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

15 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

16 hours ago