Political News

కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లివ్వటమే తప్పయిపోయిందా ?

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న విశ్లేషణల తర్వాత ఇదే నిజమనిపిస్తోంది. 243 అసెంబ్లీ సీట్ల అసెంబ్లీలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కలిసి మహాగట బంధన్ అనే కూటమిగా పోటీ చేశాయి. అయితే అంతిమ ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే తప్పు ఎక్కడ జిరిగిందో అర్ధమైపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వటమే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ చేసిన తప్పని తేలిపోయింది.

243 సీట్లలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ కు 70 సీట్లను కేటాయించింది. వామపక్షాలు మరో 25 సీట్లలో పోటీ చేశాయి. అయితే ఆర్జేడీ పోట చేసిన సీట్లలో 76 గెలుచుకుంది. అలాగే సీపీఐ ఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకుంది. సీపీఐ 6 సీట్లలో పోటీ చేస్తే రెండు గెలిచింది. ఇక సీపీఎం 4 సీట్లలో పోటీచేసి రెండు గెలిచింది. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే 70 చోట్ల పోటీ చేస్తే గెలిచింది 19 మాత్రమే. అంటే 51 సీట్లను అప్పనంగా ఎన్డీయే కూటమికి అప్పగించేసింది. కూటమిలో కూడా ఎక్కువ సీట్లను బీజేపీనే గెలుచుకున్నట్లు అర్ధమవుతోంది.

నిజానికి 70 సీట్లలో పోటీ చేసేంత సీన్ కాంగ్రెస్ కు లేదు. ఇదే విషయమై తేజస్వీ ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నేతలు వినలేదట. అసలు కాంగ్రెస్ అడిగింది 76 సీట్లు. ఎట్టి పరిస్దితుల్లోను 76 సీట్లకన్నా తగ్గేది లేదని గట్టిగానే పట్టుబట్టింది కాంగ్రెస్. అయితే 76 సీట్లు ఎట్టి పరిస్ధితుల్లోను ఇచ్చేది లేదని కాదు కూడదంటే పొత్తులో నుండి బయటకు వెళ్ళిపోవచ్చని తేజస్వీ గట్టిగా చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ఓ ఆరు సీట్లను తగ్గించుకుని 70 దగ్గర ఆగిపోయింది.

ఇపుడు ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అసలు కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఇవ్వకుండా ఏ 20 లేకపోతే 30 సీట్ల దగ్గరే ఆపేసుంటే పరిస్దితి వేరే విదంగా ఉండేదని ఆర్జేడీ వర్గాలంటున్నాయి. నిజంగానే తేజస్వి గనుక ఆ పని చేసుంటే బహుశా ఇపుడు మహాగట్ బంధనే అధికారంలోకి వచ్చుండేదేమో ? ఎన్డీయే కూటమిలో జేడీయు ఎలా దెబ్బకొట్టిందో ఎంజీబిని కాంగ్రెస్ కూడా అలాగే దెబ్బ కొట్టిన విషయం అర్ధమైపోయింది. ఏం చేస్తాం బెటర్ లక్ నెక్ట్స్ టైం అని తేజస్వికి చెప్పటం తప్ప.

This post was last modified on November 12, 2020 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

17 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago