అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ వేదికగా జరిగిన యోగా డేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 3 లక్షల మందికి పైగా జనంతో యోగాసనాలు వేయించిన ఏపీ సర్కారు అత్యధిక జనంతో యోగాసనాలు వేయించిన విషయంలో గిన్నిస్ రికార్డు సాదించింది. ఇక యోగా అంటే అప్పటిదాకా ఎంతమాత్రం అలవాటు గానీ, ప్రాక్టీస్ గానీ లేని భారీకాయులు కూడా ఉత్సాహంగా తమ మేనిని వంచి మరీ యోగాసనాలు వేశారు. వీరిలో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు.
యోగా డేలో తన అనుభవాలను అచ్చెన్ననే స్వయంగా మీడియాతో పంచుకున్నారు. వాస్తవానికి అచ్చెన్నది భారీకాయం. ఇప్పుడనే కాదు… ఆది నుంచి కూడా ఆయన భారీకాయుడే. యోగా, కరాటే, ఇతరత్రా ఆటల పోటీలకు ఆయన దాదాపుగా దూరమనే చెప్పాలి. అలాంటి అచ్చెన్న విశాఖ యోగా డేలో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఇన్ స్ట్రక్టర్లు ఎలా చెబితే అలా పిన్ పాయింట్ కూడా పొరపాటు లేకుండా ఆయన యోగాసనాలు వేశారు. అంతటి భారీకాయంతో పకడ్బందీగా యోగాసనాలు వేసిన అచ్చెన్నను నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే.
అయినా అంతటి భారీకాయంతో అచ్చెన్న యోగాసనాలు ఎలా వేయగలిగారు? అంటే… దానికి సమాధానం కూడా అచ్చెన్ననే చెప్పారు. యోగా డేకు ఓ మూడు రోజుల ముందుగా జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు… అచ్చెన్నను, ఆయన భారీకాయాన్ని చూసి ఓ మాట అన్నారట. అచ్చెన్నాయుడు గారు… మీరు సరిగ్గా యోగాసనాలు వేస్తే సరి.. లేదంటే విశాఖ యోగా డేకు రావద్దని చెప్పారట. ఈ మాట అచ్చెన్నకు ఎక్కడో తగిలిందట. అంతే… ఎలాగైనా ఇతరుల్లాగే పకడ్బందీగా యోగాసనాలు వేయాల్సిందేనని నిశ్చయించుకున్నారట.
బాబు మాటలతో తనలో ఓ థృడమైన విశ్వాసం కలిగిందని అచ్చెన్న చెప్పుకొచ్చారు. భారీకాయం ఉంటే మాత్రం తానెందుకు యోగా చేయలేనని ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చానని ఆయన అన్నారు. అంతే… ఎలాగైనా యోగాను చేయాల్సిందేనని నిర్ణయించుకున్న అచ్చెన్న…యోగా డే నాడు అందరి మాదిరిగానే పకడ్బందీగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత యోగాసనాల గురించి తీసుకుంటే… ఫస్ట్ ప్రైజ్ తనకే రావాలని అచ్చెన్న అన్నారు. ఇతరుల మాదిరే సింగిల్ పిన్ పాయింట్ కూడా తప్పకుండా యోగాసనాలు చేసిన తాను ఫస్ట్ ప్రైజ్ కు అర్హుడినేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతైనా బాబు ఒక్క మాటతో అచ్చెన్న ఓ రేంజిలో యోగాసనాలు వేయడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.
This post was last modified on June 22, 2025 11:50 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…