అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ వేదికగా జరిగిన యోగా డేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 3 లక్షల మందికి పైగా జనంతో యోగాసనాలు వేయించిన ఏపీ సర్కారు అత్యధిక జనంతో యోగాసనాలు వేయించిన విషయంలో గిన్నిస్ రికార్డు సాదించింది. ఇక యోగా అంటే అప్పటిదాకా ఎంతమాత్రం అలవాటు గానీ, ప్రాక్టీస్ గానీ లేని భారీకాయులు కూడా ఉత్సాహంగా తమ మేనిని వంచి మరీ యోగాసనాలు వేశారు. వీరిలో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు.
యోగా డేలో తన అనుభవాలను అచ్చెన్ననే స్వయంగా మీడియాతో పంచుకున్నారు. వాస్తవానికి అచ్చెన్నది భారీకాయం. ఇప్పుడనే కాదు… ఆది నుంచి కూడా ఆయన భారీకాయుడే. యోగా, కరాటే, ఇతరత్రా ఆటల పోటీలకు ఆయన దాదాపుగా దూరమనే చెప్పాలి. అలాంటి అచ్చెన్న విశాఖ యోగా డేలో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఇన్ స్ట్రక్టర్లు ఎలా చెబితే అలా పిన్ పాయింట్ కూడా పొరపాటు లేకుండా ఆయన యోగాసనాలు వేశారు. అంతటి భారీకాయంతో పకడ్బందీగా యోగాసనాలు వేసిన అచ్చెన్నను నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే.
అయినా అంతటి భారీకాయంతో అచ్చెన్న యోగాసనాలు ఎలా వేయగలిగారు? అంటే… దానికి సమాధానం కూడా అచ్చెన్ననే చెప్పారు. యోగా డేకు ఓ మూడు రోజుల ముందుగా జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు… అచ్చెన్నను, ఆయన భారీకాయాన్ని చూసి ఓ మాట అన్నారట. అచ్చెన్నాయుడు గారు… మీరు సరిగ్గా యోగాసనాలు వేస్తే సరి.. లేదంటే విశాఖ యోగా డేకు రావద్దని చెప్పారట. ఈ మాట అచ్చెన్నకు ఎక్కడో తగిలిందట. అంతే… ఎలాగైనా ఇతరుల్లాగే పకడ్బందీగా యోగాసనాలు వేయాల్సిందేనని నిశ్చయించుకున్నారట.
బాబు మాటలతో తనలో ఓ థృడమైన విశ్వాసం కలిగిందని అచ్చెన్న చెప్పుకొచ్చారు. భారీకాయం ఉంటే మాత్రం తానెందుకు యోగా చేయలేనని ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చానని ఆయన అన్నారు. అంతే… ఎలాగైనా యోగాను చేయాల్సిందేనని నిర్ణయించుకున్న అచ్చెన్న…యోగా డే నాడు అందరి మాదిరిగానే పకడ్బందీగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత యోగాసనాల గురించి తీసుకుంటే… ఫస్ట్ ప్రైజ్ తనకే రావాలని అచ్చెన్న అన్నారు. ఇతరుల మాదిరే సింగిల్ పిన్ పాయింట్ కూడా తప్పకుండా యోగాసనాలు చేసిన తాను ఫస్ట్ ప్రైజ్ కు అర్హుడినేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతైనా బాబు ఒక్క మాటతో అచ్చెన్న ఓ రేంజిలో యోగాసనాలు వేయడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.
This post was last modified on June 22, 2025 11:50 am
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…