Political News

గంటాకు బ్యాంకు షాక్ ఇచ్చినట్లేనా ?

ఉత్తరాంధ్రలో సీనియర్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యంకు పెద్ద షాకే ఇచ్చింది. ఎందుకంటే గంటా కీలకంగా వ్యవహరించిన చాలా సంస్ధలకు చెందిన ఆస్తులను వేలం వేయబోతున్నట్లు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈనెల 23వ తేదీ వరకు ఈ- వేలం పాటలో పాల్గొనే వాళ్ళు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. 25వ తేదీన టెండర్లను బ్యాంకు ఓపెన్ చేస్తుంది. ప్రత్యూషా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ ఇప్పటికే బ్యాంకు అటాచ్ చేసేసింది.

ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా, ప్రత్యూషా గ్లోబల్ ట్రేడ్, ప్రత్యూషా ఎస్టేట్స్ లాంటివన్నీ ప్రత్యూషా గ్రూపులో అంతర్భాగాలు. ఈ గ్రూపు ఇండియన్ బ్యాంకులో అప్పుడెప్పుడో సుమారు రూ. 150 కోట్ల రుణం తీసుకుంది. అయితే తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టింది. దాంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఇపుడు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 250 కోట్లకు చేరిందట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై కంపెనీలో గంటా శ్రీనివాసరావు ఒకపుడు చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే బ్యాంకులో గ్రూపు అప్పు తీసుకున్నపుడు గంటా కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. అయితే ఆ కంపెనీతో తనకేమీ సంబంధం లేదని ఇపుడు గంటా చెబుతున్నారు. అప్పులతో కానీ వేలంపాటతో కానీ తనకు సంబంధం లేదని గంటా చెబుతున్నా వేలం వేయబోయే ఆస్తుల్లో గంటా సొంతాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.

విశాఖలోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులతో పాటు రుషికొండ, భీమిలీ, మధురవాడ, గాజువాక, ఆనందపురంలో ఉన్న ఆస్తులు వేలం వేయబోతున్నట్లు బ్యాంకు వేలం నోటిసులో చెప్పింది. మరి వేలం వేసిన తర్వాతే ఎవరెవరి ఆస్తులున్నాయో ? అప్పు ఎగొట్టడంలో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది తేలుతుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on November 12, 2020 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

4 minutes ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

42 minutes ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

3 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

4 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

5 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

5 hours ago