Political News

ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత? లేకపోతే ఎంత?

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినిమా రంగానికే చెందిన యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎమ్యెల్యేగా ఉంటే ఎం?… లేకపోతే ఎంత అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హిందూపురంలో పర్యటించిన శ్యామల…పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని టీడీపీ గానీ, బాలకృష్ణ గానీ ఏ మేర నెరవరేర్చారని ఆమె ప్రశ్నించారు.

హిందూపురంలో బాలకృష్ణ వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని శ్యామల అన్నారు. హిందూపురం ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసలు బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఎన్నిసార్లు హిందూపురం వచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడు హిందూపురం వచ్చినా…ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లుగా ఇలా వచ్చే బాలయ్య అలా వెళ్లిపోతున్నారని కూడా ఆమె విమర్శించారు.

హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఎలా ఉందని శ్యామల పట్టణ ప్రజలను ప్రశ్నించారు. కేవలం ఓ శిలాఫలకం వేసి.. దానిని ఫొటోలు వేయించుకుని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, అయితే కళాశాల ఏర్పాటు మాత్రం ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగానే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న బాలయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on June 20, 2025 4:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Shayamla

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

4 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

7 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

8 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

9 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

9 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago