Political News

ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత? లేకపోతే ఎంత?

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినిమా రంగానికే చెందిన యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎమ్యెల్యేగా ఉంటే ఎం?… లేకపోతే ఎంత అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హిందూపురంలో పర్యటించిన శ్యామల…పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని టీడీపీ గానీ, బాలకృష్ణ గానీ ఏ మేర నెరవరేర్చారని ఆమె ప్రశ్నించారు.

హిందూపురంలో బాలకృష్ణ వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని శ్యామల అన్నారు. హిందూపురం ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసలు బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఎన్నిసార్లు హిందూపురం వచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడు హిందూపురం వచ్చినా…ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లుగా ఇలా వచ్చే బాలయ్య అలా వెళ్లిపోతున్నారని కూడా ఆమె విమర్శించారు.

హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఎలా ఉందని శ్యామల పట్టణ ప్రజలను ప్రశ్నించారు. కేవలం ఓ శిలాఫలకం వేసి.. దానిని ఫొటోలు వేయించుకుని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, అయితే కళాశాల ఏర్పాటు మాత్రం ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగానే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న బాలయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on June 20, 2025 4:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Shayamla

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago