వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం రాత్రి మరోమారు విజయవాడ జైలు నుంచి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. జైలు అదికారులే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టైన వంశీ… జైలులో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా సమర్పించింది. తాజాగా గురువారం డీహైడ్రేషన్ తో పాటు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వంశీని ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ అధికారంలో ఉండగా… గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ఎలాగైనా మాఫీ చేయించుకోవాలన్న ప్లాన్ వేసిన వంశీ… పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో సత్యవర్ధన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. సత్యవర్ధన్ ను వంశీ తన అనుచరులతో కిడ్నాప్ చేయించారని నిర్ధారించుకుని వంశీని అరెస్టు చేశారు.
ఈ కేసులో వంశీకి కోర్టు రిమాండ్ విధించగా… పోలీసులు ఆ తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ పట్టాల పంపిణీ, భూకబ్జా తదితర కేసులు కూడా వరుసగా నమోదు చేశారు. ఈ కేసుల్లోనూ వంశీకి కోర్టు రిమాండ్ విధించగా… ఓ కేసులో బెయిల్ లభించినా.. మరో కేసు రిమాండ్ నేపథ్యంలో రోజుల తరబడి ఆయన జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. జైలుకు వచ్చే నాటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ… జైలుకు వచ్చాక ఆ సమస్యలతో మరింతగా ఇబ్బంది పడ్డారు. ముఖం గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారు. తాజాగా ఆయన మరోమారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు.
This post was last modified on June 20, 2025 1:53 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…