వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసుల్లో పెట్టిన సెక్షన్లు గమనిస్తే.. ఆయనకు కనీసం ఏడేళ్లు తక్కువ కాకుండా శిక్షలు పడేలా ఉండడం గమనార్హం. దీంతో ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసేందుకు పోలీసులకు అవ కాశం ఏర్పడింది. బుధవారం వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో అంబటి రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను తోసిపుచ్చారు. ఆయన సోదరుడు అంబటి మురళి కూడా ఈ కార్యక్రమంలో రెచ్చిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూనే.. మరోవైపు బారికేడ్లను తోసి విసిరేశారు. వాస్తవానికి ఆ సమయంలో పోలీసులు కొంత మేరకు సంయమనం పాటించారు. అయితే.. జగన్ వస్తున్న ఊపులో ఉన్న వైసీపీ నాయకులు పోలీసులను సైతం లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే ఇష్టానుసారంగా వ్యవహరించారు.
దీంతో ఇవన్నీ రికార్డు చేసుకున్న పోలీసులు.. గురువారం ఉదయం వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలతో బ్యానర్లు ప్రదర్శించిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఏటుకూరు వద్ద జరిగి ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో జగన్ కాన్వాయ్ సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు.
మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ఒక్క పర్యటనకు సంబంధించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మంది కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఒక్కొక్క కేసులో 20 నుంచి 30 మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక, నాయకుల విషయానికి వస్తే.. ఒక్కొక్కరు సెంట్రిక్గా వారు చేసిన తీరును బట్టి కేసులు కట్టారు.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…