వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని రెంటపాళ్లలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాడేపల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్తో బయలు దేరారు. పోలీసులు కేవలం 100మంది కార్యకర్తలకు, 30 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ.. జగన్ ఆయన అనుచరులు మాత్రం వందల సంఖ్యలో బయలు దేరారు. రహదారి పొడవునా సుమారు 70 కిలో మీటర్ల మేరకు రోడ్ షో నిర్వహిస్తూ.. ముందుకు సాగారు.
అయితే.. జగన్ కాన్వాయ్ వాహనాలపైనా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. కేవలం మూడు వాహనా లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కానీ, పదుల సంఖ్యలో వాహనాలు జగన్ను అనుసరిం చాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడిని కాన్వాయ్లోని ఓ వాహనం ఢీ కొట్టింది. అయితే.. వృద్ధుడిని ఢీ కొట్టిన విషయం కాన్వాయ్ సిబ్బంది గుర్తించారో లేదో తెలియదు కానీ.. అతనిని వదిలేసి తమ మానాన తాము వెళ్లిపోయారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి తీవ్ర గాయాలతో వృద్ధుడు పడిపోయాడు.
గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ దగ్గర ఘటన జరిగింది. అయితే.. విషయం తెలిసిన స్థానిక రైతులు.. వృద్ధుడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. వృద్ధుడిని ఓ ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్రగాయాలతో అప్పటికే తీవ్రంగా రక్తం కోల్పోయిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on June 18, 2025 1:56 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…