వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని రెంటపాళ్లలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాడేపల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్తో బయలు దేరారు. పోలీసులు కేవలం 100మంది కార్యకర్తలకు, 30 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ.. జగన్ ఆయన అనుచరులు మాత్రం వందల సంఖ్యలో బయలు దేరారు. రహదారి పొడవునా సుమారు 70 కిలో మీటర్ల మేరకు రోడ్ షో నిర్వహిస్తూ.. ముందుకు సాగారు.
అయితే.. జగన్ కాన్వాయ్ వాహనాలపైనా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. కేవలం మూడు వాహనా లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కానీ, పదుల సంఖ్యలో వాహనాలు జగన్ను అనుసరిం చాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడిని కాన్వాయ్లోని ఓ వాహనం ఢీ కొట్టింది. అయితే.. వృద్ధుడిని ఢీ కొట్టిన విషయం కాన్వాయ్ సిబ్బంది గుర్తించారో లేదో తెలియదు కానీ.. అతనిని వదిలేసి తమ మానాన తాము వెళ్లిపోయారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి తీవ్ర గాయాలతో వృద్ధుడు పడిపోయాడు.
గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ దగ్గర ఘటన జరిగింది. అయితే.. విషయం తెలిసిన స్థానిక రైతులు.. వృద్ధుడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. వృద్ధుడిని ఓ ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్రగాయాలతో అప్పటికే తీవ్రంగా రక్తం కోల్పోయిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on June 18, 2025 1:56 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…