Political News

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలను ఏర్పాటు చేయాలని ఇటీవలే రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవులను సంరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రేవంత్ ప్రకటించారు. గోశాలల ఏర్పాటుకు సంబందించి విధి విధానాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ చర్యలను ఆకాశానికెత్తేస్తూ రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ నిర్ణయం గొప్పదని రాజా సింగ్ అన్నారు. గో రక్షణ కోసం రాష్ట్రంలో ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, అందులో తనకూ సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే.. గుర్తుకు వచ్చే రెండో పేరు రేవంత్ దేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తొలి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దని ఆయన అన్నారు. ఈ తరహా చర్యల ద్వారా రేవంత్ కు దేశంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణలో గోవథను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

This post was last modified on June 18, 2025 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

21 minutes ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

2 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

2 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

2 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

2 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

2 hours ago