Political News

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలను ఏర్పాటు చేయాలని ఇటీవలే రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవులను సంరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రేవంత్ ప్రకటించారు. గోశాలల ఏర్పాటుకు సంబందించి విధి విధానాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ చర్యలను ఆకాశానికెత్తేస్తూ రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ నిర్ణయం గొప్పదని రాజా సింగ్ అన్నారు. గో రక్షణ కోసం రాష్ట్రంలో ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, అందులో తనకూ సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే.. గుర్తుకు వచ్చే రెండో పేరు రేవంత్ దేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తొలి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దని ఆయన అన్నారు. ఈ తరహా చర్యల ద్వారా రేవంత్ కు దేశంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణలో గోవథను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

This post was last modified on June 18, 2025 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

2 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

3 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

3 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

8 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

11 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

11 hours ago