Political News

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలను ఏర్పాటు చేయాలని ఇటీవలే రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవులను సంరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రేవంత్ ప్రకటించారు. గోశాలల ఏర్పాటుకు సంబందించి విధి విధానాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ చర్యలను ఆకాశానికెత్తేస్తూ రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ నిర్ణయం గొప్పదని రాజా సింగ్ అన్నారు. గో రక్షణ కోసం రాష్ట్రంలో ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, అందులో తనకూ సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే.. గుర్తుకు వచ్చే రెండో పేరు రేవంత్ దేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తొలి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దని ఆయన అన్నారు. ఈ తరహా చర్యల ద్వారా రేవంత్ కు దేశంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణలో గోవథను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

This post was last modified on June 18, 2025 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

24 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

31 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago